ETV Bharat / offbeat

అన్నదాతలకు గుడ్​న్యూస్​ - పీఎం కిసాన్​ 19వ విడత నిధుల రిలీజ్​ డేట్​ ఫిక్స్​ - ఆరోజే అకౌంట్లోకి డబ్బు! - PM KISAN 19TH INSTALLMENT DATE

- పీఎం కిసాన్​ లబ్దిదారుల జాబితా విడుదల - స్టేటస్​ ఇలా చెక్​ చేసుకోండి

PM Kisan 19th Installment Release Date
PM Kisan 19th Installment Release Date (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 20, 2025, 3:09 PM IST

PM Kisan 19th Installment Release Date: రైతులకు కేంద్ర సర్కార్​ గుడ్​న్యూస్​ చెప్పింది. 19వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధుల విడుదలకు సంబంధించిన తేదీని ప్రకటించింది. ఈ స్కీమ్ ద్వారా మొత్తం 9 కోట్ల మంది పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇంతకీ ఈ డబ్బులు ఎప్పుడు రైతుల ఖాతాల్లో జమకానున్నాయి? ఒకవేళ ఇంకా ఎవరైనా ఇ-కేవైసీ చేసుకోకపోతే ఎలా పూర్తి చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

19 వ విడత ఎప్పుడంటే: కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు "ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి" పథకాన్ని ప్రవేశపెట్టింది. 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా రైతులకు పంట సాయంగా ఎకరానికి సంవత్సరానికి 6 వేల రూపాయలు అందిస్తోంది. ఈ 6 వేల రూపాయలను ప్రతి సంవత్సరం మూడు దఫాలుగా నేరుగా రైతుల అకౌంట్స్​లో జమ చేస్తూ వస్తోంది. తొలి విడతగా ఏప్రిల్ - జులై, రెండో విడతగా ఆగస్టు- నవంబర్, మూడో విడతగా డిసెంబర్-మార్చిలో రూ.2 వేల చొప్పున కేంద్ర సర్కార్ ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తోంది.

ఇప్పుటి వరకు పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర సర్కార్ 18 సార్లు రైతుల ఖాతాల్లో నిధులు విడుదల చేసింది. ఇప్పుడు 19వ దఫా నిధులు విడుదల కోసం ఎదురుచూస్తున్న రైతులకు గుడ్​న్యూస్ చెప్పింది. తాజాగా 19వ విడత పీఎం కిసాన్ డబ్బులను "2025, ఫిబ్రవరి 25వ" తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రిలీజ్ చేస్తారని పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ పేర్కొంది.

ఇప్పటికే 19వ విడత నిధుల పొందే లబ్ధిదారుల లిస్ట్​ను వెబ్​సైట్​లో ఉంచింది. అదే విధంగా పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులు రూ. 2 వేలు పొందాలంటే ఇ- కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని అధికారిక వెబ్​సైట్​లో సూచించారు. మరి లబ్ధిదారుల జాబితా ఎలా తెలుసుకోవాలి, ఇ- కేవైసీ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం.

లబ్ధిదారుల జాబితా ఇలా తెలుసుకోండి:

  • ముందుగా పీఎం కిసాన్​ అధికారిక వెబ్​సైట్​ ఓపెన్​ చేయాలి. www.pmkisan.gov.in
  • హోమ్​ పేజీలో Farmers Cornerలో "Beneficiary List" ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలను సెలెక్ట్​ చేసుకోవాలి.
  • లబ్ధిదారుల జాబితా కోసం ''Get Report" ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • మీ గ్రామంలోని లబ్ధిదారుల పేర్లు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటిలో మీ పేరు ఉందో? లేదో? చెక్​ చేసుకోవాలి.

ఒకవేళ అందులో మీరు పేరు లేదంటే మీరు ఈ కేవైసీ చేయించుకోనట్లే. e-KYC ఎలా చేయాలంటే:

  • ముందుగా పీఎం కిసాన్​ అధికారిక వెబ్​సైట్​ https://pmkisan.gov.in/ లోకి లాగిన్​ అవ్వాలి.
  • ఆ తర్వాత హోమ్​ పేజీలో కుడివైపున e-KYC ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • తర్వాత ఆధార్​ నెంబర్​ ఎంటర్​ చేసి 'Search'​ ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • తర్వాత వివరాలు స్క్రీన్​ మీద డిస్​ప్లే అవుతాయి. ఓటీపీ సాయంతో ఈ ప్రక్రియ పూర్తి చేయొచ్చు.

ఇలా కూడా: అధికారిక వెబ్​సైట్​లో ఇ - కేవైసీ చేసుకోలేని వారు పీఎం కిసాన్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి కూడా బయోమెట్రిక్ సాయంతో ఇ-కేవైసీ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

రైతులకు అద్దిరిపోయే ప్రభుత్వ స్కీమ్​ - నెలకు రూ.3 వేల పెన్షన్ - అప్లై చేసుకోండిలా!​

హెచ్చరిక : పీఎం కిసాన్ డబ్బులకు ఎసరు పెట్టారు - తొందరపడ్డారో ఖతమే!

అన్నదాతలకు గుడ్ న్యూస్ - ఈ యాప్​తో పంట తెగుళ్లు, వైరస్​లను ఇట్టే తెలుసుకోవచ్చు!

PM Kisan 19th Installment Release Date: రైతులకు కేంద్ర సర్కార్​ గుడ్​న్యూస్​ చెప్పింది. 19వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధుల విడుదలకు సంబంధించిన తేదీని ప్రకటించింది. ఈ స్కీమ్ ద్వారా మొత్తం 9 కోట్ల మంది పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇంతకీ ఈ డబ్బులు ఎప్పుడు రైతుల ఖాతాల్లో జమకానున్నాయి? ఒకవేళ ఇంకా ఎవరైనా ఇ-కేవైసీ చేసుకోకపోతే ఎలా పూర్తి చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

19 వ విడత ఎప్పుడంటే: కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు "ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి" పథకాన్ని ప్రవేశపెట్టింది. 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా రైతులకు పంట సాయంగా ఎకరానికి సంవత్సరానికి 6 వేల రూపాయలు అందిస్తోంది. ఈ 6 వేల రూపాయలను ప్రతి సంవత్సరం మూడు దఫాలుగా నేరుగా రైతుల అకౌంట్స్​లో జమ చేస్తూ వస్తోంది. తొలి విడతగా ఏప్రిల్ - జులై, రెండో విడతగా ఆగస్టు- నవంబర్, మూడో విడతగా డిసెంబర్-మార్చిలో రూ.2 వేల చొప్పున కేంద్ర సర్కార్ ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తోంది.

ఇప్పుటి వరకు పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర సర్కార్ 18 సార్లు రైతుల ఖాతాల్లో నిధులు విడుదల చేసింది. ఇప్పుడు 19వ దఫా నిధులు విడుదల కోసం ఎదురుచూస్తున్న రైతులకు గుడ్​న్యూస్ చెప్పింది. తాజాగా 19వ విడత పీఎం కిసాన్ డబ్బులను "2025, ఫిబ్రవరి 25వ" తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రిలీజ్ చేస్తారని పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ పేర్కొంది.

ఇప్పటికే 19వ విడత నిధుల పొందే లబ్ధిదారుల లిస్ట్​ను వెబ్​సైట్​లో ఉంచింది. అదే విధంగా పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులు రూ. 2 వేలు పొందాలంటే ఇ- కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని అధికారిక వెబ్​సైట్​లో సూచించారు. మరి లబ్ధిదారుల జాబితా ఎలా తెలుసుకోవాలి, ఇ- కేవైసీ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం.

లబ్ధిదారుల జాబితా ఇలా తెలుసుకోండి:

  • ముందుగా పీఎం కిసాన్​ అధికారిక వెబ్​సైట్​ ఓపెన్​ చేయాలి. www.pmkisan.gov.in
  • హోమ్​ పేజీలో Farmers Cornerలో "Beneficiary List" ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలను సెలెక్ట్​ చేసుకోవాలి.
  • లబ్ధిదారుల జాబితా కోసం ''Get Report" ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • మీ గ్రామంలోని లబ్ధిదారుల పేర్లు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటిలో మీ పేరు ఉందో? లేదో? చెక్​ చేసుకోవాలి.

ఒకవేళ అందులో మీరు పేరు లేదంటే మీరు ఈ కేవైసీ చేయించుకోనట్లే. e-KYC ఎలా చేయాలంటే:

  • ముందుగా పీఎం కిసాన్​ అధికారిక వెబ్​సైట్​ https://pmkisan.gov.in/ లోకి లాగిన్​ అవ్వాలి.
  • ఆ తర్వాత హోమ్​ పేజీలో కుడివైపున e-KYC ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • తర్వాత ఆధార్​ నెంబర్​ ఎంటర్​ చేసి 'Search'​ ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • తర్వాత వివరాలు స్క్రీన్​ మీద డిస్​ప్లే అవుతాయి. ఓటీపీ సాయంతో ఈ ప్రక్రియ పూర్తి చేయొచ్చు.

ఇలా కూడా: అధికారిక వెబ్​సైట్​లో ఇ - కేవైసీ చేసుకోలేని వారు పీఎం కిసాన్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి కూడా బయోమెట్రిక్ సాయంతో ఇ-కేవైసీ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

రైతులకు అద్దిరిపోయే ప్రభుత్వ స్కీమ్​ - నెలకు రూ.3 వేల పెన్షన్ - అప్లై చేసుకోండిలా!​

హెచ్చరిక : పీఎం కిసాన్ డబ్బులకు ఎసరు పెట్టారు - తొందరపడ్డారో ఖతమే!

అన్నదాతలకు గుడ్ న్యూస్ - ఈ యాప్​తో పంట తెగుళ్లు, వైరస్​లను ఇట్టే తెలుసుకోవచ్చు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.