PM Kisan 19th Installment Release Date: రైతులకు కేంద్ర సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. 19వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధుల విడుదలకు సంబంధించిన తేదీని ప్రకటించింది. ఈ స్కీమ్ ద్వారా మొత్తం 9 కోట్ల మంది పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇంతకీ ఈ డబ్బులు ఎప్పుడు రైతుల ఖాతాల్లో జమకానున్నాయి? ఒకవేళ ఇంకా ఎవరైనా ఇ-కేవైసీ చేసుకోకపోతే ఎలా పూర్తి చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
19 వ విడత ఎప్పుడంటే: కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు "ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి" పథకాన్ని ప్రవేశపెట్టింది. 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా రైతులకు పంట సాయంగా ఎకరానికి సంవత్సరానికి 6 వేల రూపాయలు అందిస్తోంది. ఈ 6 వేల రూపాయలను ప్రతి సంవత్సరం మూడు దఫాలుగా నేరుగా రైతుల అకౌంట్స్లో జమ చేస్తూ వస్తోంది. తొలి విడతగా ఏప్రిల్ - జులై, రెండో విడతగా ఆగస్టు- నవంబర్, మూడో విడతగా డిసెంబర్-మార్చిలో రూ.2 వేల చొప్పున కేంద్ర సర్కార్ ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తోంది.
ఇప్పుటి వరకు పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర సర్కార్ 18 సార్లు రైతుల ఖాతాల్లో నిధులు విడుదల చేసింది. ఇప్పుడు 19వ దఫా నిధులు విడుదల కోసం ఎదురుచూస్తున్న రైతులకు గుడ్న్యూస్ చెప్పింది. తాజాగా 19వ విడత పీఎం కిసాన్ డబ్బులను "2025, ఫిబ్రవరి 25వ" తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రిలీజ్ చేస్తారని పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ పేర్కొంది.
ఇప్పటికే 19వ విడత నిధుల పొందే లబ్ధిదారుల లిస్ట్ను వెబ్సైట్లో ఉంచింది. అదే విధంగా పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులు రూ. 2 వేలు పొందాలంటే ఇ- కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని అధికారిక వెబ్సైట్లో సూచించారు. మరి లబ్ధిదారుల జాబితా ఎలా తెలుసుకోవాలి, ఇ- కేవైసీ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం.
లబ్ధిదారుల జాబితా ఇలా తెలుసుకోండి:
- ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. www.pmkisan.gov.in
- హోమ్ పేజీలో Farmers Cornerలో "Beneficiary List" ఆప్షన్పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలను సెలెక్ట్ చేసుకోవాలి.
- లబ్ధిదారుల జాబితా కోసం ''Get Report" ఆప్షన్పై క్లిక్ చేయాలి.
- మీ గ్రామంలోని లబ్ధిదారుల పేర్లు స్క్రీన్పై కనిపిస్తాయి. వాటిలో మీ పేరు ఉందో? లేదో? చెక్ చేసుకోవాలి.
ఒకవేళ అందులో మీరు పేరు లేదంటే మీరు ఈ కేవైసీ చేయించుకోనట్లే. e-KYC ఎలా చేయాలంటే:
- ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in/ లోకి లాగిన్ అవ్వాలి.
- ఆ తర్వాత హోమ్ పేజీలో కుడివైపున e-KYC ఆప్షన్పై క్లిక్ చేయాలి.
- తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి 'Search' ఆప్షన్పై క్లిక్ చేయాలి.
- తర్వాత వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి. ఓటీపీ సాయంతో ఈ ప్రక్రియ పూర్తి చేయొచ్చు.
ఇలా కూడా: అధికారిక వెబ్సైట్లో ఇ - కేవైసీ చేసుకోలేని వారు పీఎం కిసాన్ యాప్లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్లి కూడా బయోమెట్రిక్ సాయంతో ఇ-కేవైసీ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.
రైతులకు అద్దిరిపోయే ప్రభుత్వ స్కీమ్ - నెలకు రూ.3 వేల పెన్షన్ - అప్లై చేసుకోండిలా!
హెచ్చరిక : పీఎం కిసాన్ డబ్బులకు ఎసరు పెట్టారు - తొందరపడ్డారో ఖతమే!
అన్నదాతలకు గుడ్ న్యూస్ - ఈ యాప్తో పంట తెగుళ్లు, వైరస్లను ఇట్టే తెలుసుకోవచ్చు!