Son Killed Stepmother and Younger Brother for Property :ఉమ్మడి ఆస్తి 41 సెంట్ల పొలం, 192 గజాల ఇంటి స్థలం అన్నదమ్ముల మధ్య పంచాయితీ తీసుకొచ్చింది. తాత ద్వారా వచ్చిన ఆస్తిని ఎలాగైన తకనే దక్కాలనుకున్న అన్న కక్షగట్టి తండ్రి రెండో భార్యను, ఆమె కుమారుడిని పాశవికంగా హత్య చేశాడు. కత్తితో నరిగి, చాకుతో పీకలు కోసి నిశిరాత్రిలో బీభత్సం సృష్టించాడు. ఈ నెల 23 అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘటన ఏపీలోని మండవల్లి మండలంలో సంచలనం రేపింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరు జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆదివారం రాత్రి వివరాలు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ గన్నవరానికి చెందిన రొయ్యూరు సుబ్బారావుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య నాంచారమ్మకు నగేశ్ బాబు కుమారుడు ఉన్నాడు. ఆమె అనారోగ్య కారణంగా మృతి చెందారు. నాంచారమ్మ చెల్లెలు భ్రమరాంబను రెండో పెళ్లి చేసుకున్నాడు. వారికి సురేశ్ అనే కుమారుడు ఉన్నారు. అయితే వారు కలిసి ఉంటున్న 192 గజాల ఇంటి స్థలం విషయమై అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆస్తంతా తనకే కావాలని, ఇవ్వకపోతే చంపేస్తానని నగేశ్ బాబు తరచూ ఆమెని బెదిరించేవాడు. పెద్దలతో పంచాయితీ పెట్టినా వివాదం కొలిక్కిరాలేదు.
పరామర్శించడానికి వచ్చిన బామ్మర్దితో బావ వాగ్వాదం - పరస్పర దాడిలో ఇద్దరు మృతి