తెలంగాణ

telangana

ETV Bharat / state

నమూనాలు లేకుండా రక్త పరీక్ష - 5 నిమిషాల్లో ఫలితాలు - New Software For Testing Blood - NEW SOFTWARE FOR TESTING BLOOD

New Software For Testing Blood Developed By Telugu People : ఎలాంటి సాంపిల్స్​ లేకుండా రోగాలను గుర్తించే సాఫ్ట్​వేర్​ను తయారు చేశారు రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు. పీలోని శ్రీ సత్యసాయి జిల్లాలోని ఇస్​స్టిట్యూట్​ ఆఫ్​ హయ్యర్ లెర్నింగ్​ విద్యా సంస్థ, హైదరాబాద్​ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆస్పైర్ బయోనెస్ట్​లోని సైవన్​ వి స్టార్టప్​ కంపెనీతో కలిసి తయారు చేశాయి. మరీ ఆ సాఫ్ట్​వేర్​ ఎలా పనిచేస్తుందో తెలుసా

New Software For Testing Blood Without Sample
New Software For Testing Blood Developed By Telugu People (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 17, 2024, 11:23 AM IST

New Software For Testing Blood Without Sample :ఈ మధ్యకాలంలో యాంటి బయోటిక్​ మందుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వాటిని వాడేస్తున్నారు. అవి అవసరమా లేదా అని ఆలోచించడం లేదు. అలా వాటిని వాడకాన్ని నియంత్రించేందుకు ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలోని ఇస్​స్టిట్యూట్​ ఆఫ్​ హయ్యర్ లెర్నింగ్​ విద్యా సంస్థ, హైదరాబాద్​ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆస్పైర్ బయోనెస్ట్​లోని సైవన్​ వి స్టార్టప్​ కంపెనీతో కలిసి కంప్యూటర్ సాఫ్ట్​వేర్​ను తయారుచేశాయి.

కృత్రిమ మేధ సహాయంతో చేసిన ఈ సాఫ్ట్​వేర్​కు ఏఎంఆర్​ఎక్స్ అని పేరు పెట్టారు. ఇది అనుభవజ్ఞుడైన వైద్య నిపుణులు తన ఎదుట ఉన్న రోగికి వచ్చిన జబ్బు, వ్యాధి గురించి ఎలా విశ్లేషిస్తారో అలాగే వివరిస్తుంది. వైద్యుల మనసు, మెదడు ఎలా ఆలోచిస్తాయో అలాగే చేస్తుంది. ఈ సాఫ్ట్​వేర్​తో ఫలితాలు తక్షణమే వస్తాయి. దీంతో యాంటీ బయోటిక్​ ఔషధాల వాడకాన్ని తగ్గించొచ్చు. ఇప్పటిదాకా చాలామందితి వైద్యులు రక్త, మూత్ర పరీక్షల ఫలితాలు వచ్చేలోపు రోగి చెప్పిన అనారోగ్య లక్షణాల ప్రకారం ముందుగా యాంటి బయోటిక్స్ ఇస్తూ రిపోర్ట్​ వచ్చకా అసలు యాంటి బయోటిక్​ మందులు అవసరమా, తగ్గించాల అని నిర్ణయిస్తున్నారు.

పాముకాటుకు విరుగుడు- ల్యాబ్​లో యాంటీబాడీల అభివృద్ధి- బెంగళూరు శాస్త్రవేత్తల ఘనత!

దీన్ని ఎలా వాడుతారు అంటే : చికిత్స కోసం వచ్చిన రోగి తన లక్షణాలను చెబుతున్నప్పుడు వైద్యులు వాటిని రాసుకుని ఆ సమాచారమంతా సాఫ్ట్​వేర్​లో నమోదు చేస్తారు. ఒక్క రక్తం కూడా అవసరం లేకుండా క్షణాల్లో అది ఫలితాలను వెల్లడిస్తుంది. ఏఎంఆర్​ఎక్స్​ సాఫ్ట్​వేర్​పై నాలుగేళ్ల క్రితమే పరిశోధనలు మొదలయ్యాయి. ప్రయోగాత్మకంగా ఏపీలోని ఐదు జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు, హైదరాబాద్​లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో పదివేల మంది పేషెంట్స్​ పరిస్థితులను పరిశీలించారు.

ఒకవైపు వారి రక్త, మూత్ర నమూనాలను సేకరించారు. మరోవైపు ఆ రోగులు చెప్పిన అనారోగ్య లక్షణాలు, వారి కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోగ్య పరిస్థితులు, వంశపారంపర్యంగా సోకుతున్న జబ్బులు, వారు నివసిస్తున్న ప్రాంతాల్లో ఆరోగ్య పరిస్థితులు మొదలైన వివరాలను ఈ సాఫ్ట్​వేర్​లో అప్​లోడ్​ చేశారు. ఆ ఫలితాలను సంప్రదాయ పద్ధతిలో రోగి నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాల పరీక్షల ఫలితాలను వైద్య నిపుణులు విశ్లేషించగా రెండూ ఓకేలా ఉన్నాయి. పరిశోధనల ఫలితాలను గతేడాది ఎథిక్స్​ కమిటీకి పంపించారు. ఈ సాఫ్ట్​వేర్​ను వినియోగించవచ్చంటూ ఆరునెలల క్రితం ఐసీఎంఆర్ అనుమతిచ్చింది. దీంతో పేటెంట్​ రైట్స్​కు దరఖాస్తు చేసుకున్నారు.

"చిన్న జబ్బులతో బాధ పడుతున్నవారు, ప్రాణాంతక వ్యాధులు ఉన్నవారికి వైద్యులు యాంటీబయాటిక్‌ మందులు ఇస్తున్నారు. మందులు ఇచ్చేముందు రక్త, మూత్ర పరీక్షలు చేయిస్తారు. కానీ అందుకు భిన్నంగా ఏఎంఆర్​ఎక్స్​ సాఫ్ట్​వేర్ రోగి లక్షణాలను బట్టి రోగ నిర్ధారణ చేస్తుంది." - డాక్టర్‌ బుర్రి రంగారెడ్డి, ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌ అకాడమీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు, హైదరాబాద్‌

వంట నూనె ఇంధనంగా - నింగిలోకి దూసుకెళ్లిన 'వర్జిన్ అట్లాంటిక్​' ఫ్లైట్​​!

18వారాలకు కవల పిండం మృతి- 125 రోజులకే మరో శిశువుకు జన్మ- వైద్య రంగంలోనే అద్భుతం

ABOUT THE AUTHOR

...view details