తెలంగాణ

telangana

మంత్రాల నెపంతో తల్లీ, కుమారుడి దారుణ హత్య - రెండు కుటుంబాల మధ్య చిచ్చురేపిన మూఢనమ్మకం

By ETV Bharat Telangana Team

Published : Feb 13, 2024, 8:59 PM IST

Mother and Son Murder in Mahabubabad : చేతబడి చేస్తున్నారని నెపంతో ఓ రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ క్రమంలో ఇరు కుటుంబాలు రాజీ కోసం స్థానిక పోలీస్​ స్టేషన్​కు వెళ్లారు. కానీ అక్కడ పంచాయతీ వాయిదా పడిన నేపథ్యంలో ఓ వ్యక్తి మరో కుటుంబానికి చెందిన తల్లీ, కుమారుడిని నడిరోడ్డుపై దారుణంగా చంపాడు. ఈ అమానుష ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరులో చోటు చేసుకుంది.

A man Murdered for Practicing Black Magic
Mother and Son Murder in Mahabubabad

Mother and Son Murder in Mahabubabad :చంద్రయాన్‌ లాంటి అద్భుతాలు మానవుడిని గర్వంగా నిలబెడుతున్నా, చేతబడిలాంటి నమ్మకాలు మాత్రం తలదించుకునేలా చేస్తున్నాయి. ప్రపంచాన్నే మార్చేసే పరిజ్ఞానం వచ్చినా, కొన్ని గ్రామాల్లో మాత్రం నేటికీ అజ్ఞానానిదే పైచేయిగా నిలుస్తోంది. కృత్రిమ మేథస్సుతో రోబోలను తయారు చేస్తున్న మనిషే, మూఢనమ్మకాల మాయతో మృగాల్లా మారుతున్నాడు. మహబూబాబాద్ జిల్లాలో తాజాగా చోటుచేసుకున్న ఓ అమానుష ఘటన రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఓ వ్యక్తి తల్లి బిడ్డను నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశాడు. మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఈ ఘటన చోటు చేసుకుంది.

గత కొన్ని సంవత్సరాలుగా రెండు కుటుంబాల మధ్య మంత్రాల నెపంతో ఘర్షణలు జరుగుతున్నాయి. ఇరు కుటుంబాల మధ్య రాజీ కోసం గూడూరు పోలీస్ స్టేషన్​కు వెళ్లారు. పంచాయతీ ఈ నెల 15వ తేదీకి వాయిదా పడటంతో ఆటోలో తల్లీ సమ్మక్క, కుమారుడు సమ్మయ్య తిరిగి ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటోను అడ్డగించి కుమారస్వామి అనే వ్యక్తి వారిని నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపాడు. ఈ క్రమంలో స్థానికులు నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

A man Murdered for Practicing Black Magic :ఇదికాగా మరోచోట కూడా మూఢనమ్మకాలు ఓ ప్రాణాన్ని బలితీసుకుంది. మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో గొర్ల కాపరిని సొంత కుమారుడు, తమ్ముడు చంపారు. అనంతరం నిర్మానుష్య ప్రదేశంలో దహనం చేసేందుకు ప్రయత్నించి పారిపోయారు. నిందితులను సిద్దిపేట పోలీసులు పట్టుకున్నారు. సీఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాలు ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం నామాపూర్‌కు చెందిన నిమ్మ భూమయ్య, నిమ్మ కనకయ్య అన్నదమ్ముళ్లు.

భూమయ్య సిద్దిపేటలో గొర్రెలను కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడి తల్లి కనకయ్య వద్ద ఉంటోంది. ఆమె, కనకయ్య కుటుంబ సభ్యులు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఫిబ్రవరి 8వ తేదీన తల్లిని చూసేందుకు కనకయ్య ఇంటికి భూమయ్య, అతని కుమారుడు ప్రవీణ్‌ సిద్దిపేట నుంచి నామాపూర్‌కు వెళ్లారు. భూమయ్య మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. దీంతో భూమయ్యను చంపాలని కనకయ్య, ప్రవీణ్‌ నిర్ణయించుకున్నారు.

Man Murder in Siddipet :ఈ నేపథ్యంలో మద్యం తాగుదామని చెప్పి సిద్దిపేట వైపు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. అదే రోజు రాత్రి రాఘవాపూర్‌లో అటవీ ప్రాంతంలో ముగ్గురూ మద్యం తాగారు. భూమయ్యకు మాత్రం మద్యంలో పురుగు మందు కలిపి ఇచ్చారు. ఈ క్రమంలో అతడు అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. దీంతో నిందితులు అతణ్ని తువ్వాలుతో నోరు, మెడపై గట్టిగా నొక్కి హత్య చేశారు. మృతదేహంపై గడ్డి వేసి నిప్పంటించి, పారిపోయారు. అనంతరం పోలీసులు నిందితుల కోసం గాలించి సిద్దిపేటలో నాగదేవత ఆలయ పరిధిలోని అరెస్టు చేశారు.

భార్యపై అనుమానం- నోట్లో కరెంట్​ వైర్​ పెట్టి హత్య చేసిన భర్త

మద్యం మత్తులో పక్కింటి బాలుడి హత్య- పొలంలో మృతదేహం వేసి పరార్​- పీక్కు తిన్న జంతువులు

ABOUT THE AUTHOR

...view details