తెలంగాణ

telangana

ETV Bharat / state

వాటిపై ఫోకస్ పెట్టిన హైడ్రా - ప్రత్యేక టీమ్​తో బెంగళూరుకు కమిషనర్​ రంగనాథ్​ - HYDRA OFFICIALS VISITS BENGALURU

బెంగళూరులో హైడ్రా బృందం పర్యటన - హైడ్రా కమిషనర్​ రంగనాథ్ నేతృత్వంలో అక్కడి చెరువులపై అధ్యయనం

Hydra Officials Visits Bengaluru
Hydra Officials Visits Bengaluru (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 7, 2024, 1:49 PM IST

Hydra Officials Visits Bengaluru : చెరువుల పునరుద్దరణ, విపత్తుల నిర్వహణపై అధ్యయనానికి హైడ్రా అధికారుల బృందం బెంగళూరు బాట పట్టింది. బుధవారం హైడ్రా అధికారులు బెంగళూరు వెళ్లగా, ఇవాళ కమిషనర్ రంగనాథ్ అక్కడికి చేరుకున్నారు. రెండు రోజుల పాటు బెంగళూరులోనే పర్యటించి అక్కడి చెరువుల పునరుద్దరణపై సీనియర్ శాస్త్రవేత్తలు, పర్యావరణ ప్రముఖులతో సమావేశం కానున్నారు. యెల్లంకలో ఉన్న కర్ణాటక స్టేట్ నాచురల్ డిజాస్టర్ మానిటరింగ్​ సెంటర్​ను హైడ్రా అధికారుల బృందం సందర్శించనుంది.

బెంగళూరు పర్యటనలో హైడ్రా బృందం :నేచురల్​ డిజాస్టర్​ మానిటరింగ్ సెంటర్​ విపత్తు నిర్వహణపై సీనియర్ శాస్త్రవేత్తలతో సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి సెన్సార్స్ సహాయంతో పర్యవేక్షిస్తున్న మురుగునీటి వ్యవస్థను పరిశీలిస్తారు. బెంగళూరు కోర్ సిటిలో ఉన్న చెరువులను సందర్శిస్తారు. రెండో రోజు పర్యటనలో 'లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా' ఆనంద్ మల్లిగవాడ్​తో సమావేశం కానున్న రంగనాథ్ కర్ణాటక ట్యాంక్ కన్జర్వేషన్ డెవలప్​మెంట్ అథారిటీ చట్టం 2014పై చర్చించనున్నారు.

ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో చెరువుల సందర్శన :అనంతరం ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని మార్గందోన్హల్లీ చెరువు, ఇన్ఫోసిస్ సంస్థ అభివృద్ధి చేసిన చెరువులను సందర్శించి అక్కడ అమలు చేసిన ఉత్తమ విధానాలు, సాంకేతికతను తెలుసుకోనున్నారు. ఇటీవల ఈ విషయాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆనంద్ మల్లిగవాడ్ తో చర్చించిన రంగనాథ్ ప్రత్యక్షంగా వాటిని పరిశీలించడం ద్వారా హైదరాబాద్​లో చేపట్టాల్సిన పునరుద్దరణ చర్యలపై ఒక అంచనా ప్రకారం ప్రణాళికలు తయారుచేయనున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా నగరంలో ఐదు చెరువులను పునరుద్దరించాలని ఆదేశించిన నేపథ్యంలో హైడ్రా ఆ దిశగా చర్యలను వేగవంతం చేసింది.

నివాసాల మధ్య చెరువుల ఎఫ్​టీఎల్​ నిర్ధారణ :హైదరాబాద్​లోని చెరువుల పునరుద్దరణపై దృష్టి కేంద్రీకరించిన హైడ్రా ఇప్పటికే పలుచోట్ల ఆక్రమణలను తొలగించింది. కొద్ది రోజుల క్రితమే మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. నివాసాల మధ్య ఉన్న చెరువుల ఎఫ్​టీఎల్​ను నిర్ధారించి వాటి పునరుద్ధరణ కోసం కృషి చేస్తున్నట్లుగా హైడ్రా కమిషనర్​ రంగనాథ్ వెల్లడించారు. ఇందులో బాగంగానే ఔటర్​ రింగ్​రోడ్​ దగ్గరలోని ఖాజాగూడ వద్ద ఉన్న తౌటోని కుంటను కమిషనర్​ సందర్శించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులతో సమీక్షించారు.

ఈసారి చెట్లపై 'హైడ్రా' ఫోకస్ - ఇక హైదరాబాద్ వాసుల ట్రాఫిక్ సమస్యకు చెక్?

ఆ సమస్యలపై హైడ్రా ఫోకస్, లిస్టులో మొదటగా అదే - వీధివ్యాపారులు జర భద్రం!

ABOUT THE AUTHOR

...view details