తెలంగాణ

telangana

ETV Bharat / state

బెంగళూరులో చెరువుల పునరుద్దరణ ఎలా చేశారు? అధ్యయనం చేయనున్న హైడ్రా

బెంగళూరులో చెరువుల పునరుద్దరణపై అధ్యయనం చేయనున్న హైడ్రా - లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన ఆనంద్ మల్లిగవాడ్​తో హైడ్రా కమిషనర్ రంగనాథ్ వీడియో సమావేశం

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

RANGANATH REVIEW MEETING ON HYDRA
Ranganath Meeting With Lake Man Of India (ETV Bharat)

Hydra Commissioner Ranganath Meeting With Lake Man Of India:చెరువుల పునరుద్దరణ కోసం చేపట్టిన చర్యలపై అధ్యయనానికి హైడ్రా అధికారులు బెంగళూరు వెళ్లాలని చూస్తున్నారు. అక్కడ అతి తక్కువ ఖర్చుతో చెరువులకు జీవం పోసిన విధానాన్ని పరిశీలించాలని కమిషనర్ రంగనాథ్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన ఆనంద్ మల్లిగవాడ్​తో తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన రంగనాథ్ బెంగళూరులో 35 చెరువుల పునరుద్దరించిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.

బెంగ‌ళూరులో ఏర్పాటు చేసిన విధానంపై హైడ్రా: ఆనంద్​ను హైదరాబాద్​కు పిలిపించి ఇక్కడ చెరువుల పునరుద్దరణపై సహకారం అందజేయాలని రంగనాథ్ కోరారు. అలాగే చెరువుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి స్వచ్ఛమైన నీరు చెరువుల్లోకి చేరేలా ఏర్పాట్లు చేయాలని హైడ్రా నిర్ణయించింది. మురుగు నీటి కాలువ‌ల నుంచే శుద్ధి చేసే ప్ర‌క్రియ‌ను ప్రారంభించి చెరువులోకి చేరే ముందు మూడు నాలుగు ద‌శ‌ల్లో నీరు ఉంచి ఫిల్ట‌ర్ చేసిన తీరుపై హైడ్రా దృష్టి పెట్టనుంది. మురుగు నీటి కాలువ‌లకు రెండు వైపులా మొక్క‌లు నాట‌డం, చెరువుకు చేరేలోపే కొంత‌మేర శుద్ధి జ‌రిగేలా బెంగ‌ళూరులో ఏర్పాటు చేసిన విధానంపై అధ్య‌య‌నం చేయనుంది. చెరువుల పునరుద్దరణ కోసం స్థానికులను పెద్ద సంఖ్య‌లో భాగ‌స్వామ్యం క‌ల్పించి వారికే నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లు స్వ‌చ్ఛందంగా తీసుకునేలా హైడ్రా క‌స‌ర‌త్తు చేస్తోంది.

నెల రోజుల పాటు కూల్చివేతలకు విరామం ఇచ్చిన హైడ్రా, ఈ సమయంలో మహానగరం పరిధిలోని ప్రతి చెరువు చరిత్రను వెలికి తీయాలని నిర్ణయించింది. ఇందులో సుమారు 200 మంది అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. దీనికి అత్యాధునిక వ్యవస్థలను ఉపయోగించనున్నారు. భవిష్యత్తులో ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకుండా రియల్‌ టైం లొకేషన్‌ వ్యవస్థనూ అందుబాటులోకి తేవడానికి హైడ్రా కసరత్తు చేస్తోంది. మరోవైపు ఇప్పటికే కూల్చివేతలు చేపట్టిన చెరువుల సుందీరకరణ పనులను ఈ వారంలో మొదలు పెట్టాలని నిర్ణయించింది. డిసెంబర్‌ నెలాఖరు నాటికి కొన్ని చెరువుల సుందరీకరించి, సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని అనుకుంటున్నారు.

ఆక్ర‌మ‌ణ‌ల‌కు ఆస్కారం లేకుండా యాప్‌ - సిద్ధం చేస్తున్న హైడ్రా

కూల్చివేతలకు చిన్న బ్రేక్ ఇచ్చిన హైడ్రా - డిసెంబర్​ నాటికి ఆ చెరువుల సుందరీకరణ! - HYDRA on of Encroached Ponds In Hyd

ABOUT THE AUTHOR

...view details