తెలంగాణ

telangana

ETV Bharat / state

తీర్పులో మానవత్వాన్ని చాటుకున్న జడ్జి - సాక్ష్యం లేక కొట్టేసిన కేసులో బాధితురాలికి పరిహారం - HUMANITY IN JUDGMENT

నిందితుడిపై నేరం రుజువు కాలేదని కొట్టేసిన కేసులో బాధిత బాలికకు పరిహారం - రూ.3 లక్షలను బాలికకు ప్రభుత్వం నుంచి ఇప్పించాలని ఆదేశించి మానవత్వాన్ని చాటుకున్న న్యాయమూర్తి

Judge Who Showed Humanity in His Verdict
Judge Who Showed Humanity in His Verdict (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 30, 2024, 3:24 PM IST

Judge Who Showed Humanity in His Verdict :నిందితుడిపై నేరం రుజువు కాలేదని కేసు కొట్టేసినా బాధిత బాలికకు పరిహారం కింద 3 లక్షల రూపాయలను ప్రభుత్వం నుంచి ఇప్పించాలని తీర్పు చెప్పి మానవత్వాన్ని చాటుకున్నారు న్యాయమూర్తి మనీషా శ్రవన్‌ ఉన్నమ్‌. ఈ ఘటన గత బుధవారం వరంగల్‌ జిల్లాలోని పోక్సో న్యాయస్థానంలో జరిగింది.

సాక్ష్యం లేక కొట్టేసిన కేసులో బాధితురాలికి పరిహారం :శుక్రవారం ప్రాసిక్యూషన్‌ తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని ఓ పోలీస్​ స్టేషన్‌ పరిధిలో తల్లిదండ్రులు లేని ఓ 17 ఏళ్ల బాలిక తన నానమ్మ వద్ద ఉంటూ చదువుకుంటోంది. ఓ ఫ్రెండ్ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ యువకుడు ఆమెకు పరిచయం అయ్యాడు. ప్రేమిస్తున్నాను.. వివాహం చేసుకుంటాను అని మాయమాటలు చెప్పి ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. దీంతో ఆ బాలిక గర్భవతి అయింది. ఈ విషయాన్ని అతనికి చెప్పగా తనకెలాంటి సంబంధం లేదని ఆ యువకుడు బుకాయించాడు. దీనిపై ఆమె పోలీసులను ఆశ్రయించగా వారు ఆ యువకుడిపై కేసు నమోదు చేశారు.

బాలికకు రూ.3 లక్షలు ఇప్పించాలని తీర్పు :కేసు విచారణలో సదరు బాలిక, ఆమె నానమ్మ న్యాయస్థానంలో నిందితుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకపోవడంతో న్యాయమూర్తి కేసును కొట్టివేశారు. నేరం రుజువు కాకపోవడం వల్ల కేసును కొట్టివేసినప్పటికీ ఆ బాలికకు జరిగిన మానసిక, శారీరక గాయాలను దృష్టిలో ఉంచుకొని న్యాయమూర్తి ఆమెకు ప్రభుత్వం నుంచి 3 లక్షల రూపాయల పరిహారం ఇప్పించాలంటూ జిల్లా న్యాయసేవాధికార సంస్థను ఆదేశించారు.

'పెళ్లైన కుమార్తె జీవితాంతం తల్లిదండ్రుల ఫ్యామిలీలో భాగమే - కారుణ్య నియామకం కింద ఆమెకు వెంటనే జాబ్​ ఇవ్వండి'

మైనర్​ను​ ప్రేమించి పెళ్లాడిన లెక్చరర్​ - నిందితుడిపై పోక్సో​ కేసు నమోదు

ABOUT THE AUTHOR

...view details