తెలంగాణ

telangana

'జలాశయాలు పూర్తిగా అడుగంటిపోయే పరిస్థితి'- మంత్రి ఉత్తమ్​కు హరీశ్​రావు లేఖ - Harish Rao Letter to Minister Uttam

By ETV Bharat Telangana Team

Published : Aug 3, 2024, 10:51 AM IST

Updated : Aug 3, 2024, 11:27 AM IST

Harish Rao on Water in Reservoirs : సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాలు పూర్తిగా అడుగంటిపోయాయని మాజీమంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. ఈ మేరకు మధ్యమానేరు నుంచి నీటిని పంపింగ్ చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన లేఖ రాశారు.

Harish Rao Letter to Minister Uttam on Reservoirs
Harish Rao on Water in Reservoirs (ETV Bharat)

Harish Rao Letter to Minister Uttam on Reservoirs :సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ జలాశయాలు పూర్తిగా నీళ్లు లేక అడుగంటిపోయే పరిస్థితికి చేరుకున్నాయని మాజీ మంత్రి హరీశ్​రావు తెలిపారు. ఈ మేరకు ఆయన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​రెడ్డికి దీనిపై లేఖ రాశారు. గత సంవత్సరం ఇదే ఆగస్టు నెలలో ఆయా జలాశయాల్లో నీరు నిల్వ ఉందని, ఇప్పుడు చాలా తక్కువ నీరు ఉందని పేర్కొన్నారు. ఒకవైపు జలాశయాల్లో నీళ్లు లేక, మరోవైపు వర్షాలు కురవక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని వ్యాఖ్యానించారు.

పంటలు వేయాలా వద్దా అనే అయోమయంతో రైతులు ఆవేదన చెందుతున్నారని హరీశ్​రావు తెలిపారు. గత సంవత్సరంలో ఇదే సమయంతో పోలిస్తే జిల్లాల్లో పంటల సాగు విస్తీర్ణం కూడా తగ్గిపోయిందని వెల్లడించారు. రాజకీయాలు పక్కనపెట్టి మధ్యమానేరు నుంచి అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్​లకు నీటిని పంపింగ్ చేసేలా అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ఆయకట్టుకు నీళ్లందించేలా చర్యలు తీసుకోవాలని, జిల్లా రైతాంగం పక్షాన కోరుతున్నానని పేర్కొన్నారు.

Harish Rao Letter to Minister Uttam (ETV Bharat)

పీఏసీ ఛైర్మన్​గా హరీశ్​ రావు ! : మరోవైపు ప్రజా పద్దుల సంఘం ఛైర్మన్​గా మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ శాసనసభ్యుడు హరీశ్​రావు ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రజా పద్దుల సంఘంతో పాటు అంచనాల కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల సమితి సభ్యుల ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. మూడు కమిటీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటారు. బీఆర్​ఎస్​ నుంచి పీఏసీ సభ్యులుగా మాజీ మంత్రులు హరీశ్​రావు, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ పేర్లు ఇచ్చినట్లు తెలిసింది. కమిటీ ఏర్పాటు అనంతరం ఛైర్మన్​ను ఎన్నుకుంటారు. ప్రజా పద్దుల సంఘం ఛైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్షానికి దక్కుతుంది. దీంతో పీఏసీ ఛైర్మన్​గా హరీశ్​​రావును ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇది జాబ్‌ క్యాలెండర్‌ కాదు జోక్ క్యాలెండర్‌: హరీశ్‌ రావు

ఉపాధ్యాయులకు పీఆర్​సీ ఎప్పుడు ప్రకటిస్తారు? - సీఎం రేవంత్​కు హరీశ్ రావు లేఖ - Harish Rao Letter to cm Revanth

Last Updated : Aug 3, 2024, 11:27 AM IST

ABOUT THE AUTHOR

...view details