ETV Bharat / state

ఇది కదా నిజమైన ప్రేమంటే! - దివ్యాంగురాలైన భార్యకు అన్నీ తానైన భర్త - TRUE LOVE BETWEEN HUSBAND AND WIFE

ఓ ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన భార్య - దివ్యాంగురాలైన భార్యకు అన్నీతానై సేవ చేస్తున్న భర్త - దివ్యాంగ పింఛన్​, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని భర్త విజ్ఞప్తి

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 14, 2025, 10:21 AM IST

True love between husband and wife : ప్రస్తుత కాలంలో పరిస్థితులన్నీ బాగున్నప్పటికీ, చిన్న చిన్న కారణాలకే గొడవలు పడి, విడిపోయే భార్యాభర్తలు ఈ జంటను చూసి నేర్చుకోవాలి. ఓ ప్రమాదంలో రెండు కాళ్లూ కోల్పోయిన భార్యకు అన్నీ తానై కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు ఈ భర్త. ఈ క్రమంలో వివాహ బంధానికి సరైన అర్థాన్ని చాటి చెబుతున్నారు ఈ దంపతులు. పూర్తి వివరాల్లోకి వెళితే,

ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయి : హైదరాబాద్​లోని చందానగర్​లో నివసిస్తున్న మారెప్పకు వికారాబాద్​ జిల్లా తాండూరుకు చెందిన అనంతితో 2017లో పెళ్లి జరిగింది. వారికి ఇద్దరమ్మాయిలు ఐశ్వర్య (6), సాక్షి(3) ఉన్నారు. ఈ దంపతులు ఇద్దరూ భవన నిర్మాణ కార్మికులే. చక్కగా సాగిపోతున్న సంసారంలో ఒక్కసారిగా అనుకోని సంఘటన చోటుచేసుకుంది. 2022లో తాండూరులో ట్రైన్ ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు అనంతి కిందపడిపోయింది. దీంతో చక్రాల కింద కాళ్లు నలిగిపోయాయి. ప్రాణాలతో బయటపడిన ఆమెకు డాక్టర్లు రెండు కాళ్లను తొలగించారు.

భార్యకు అన్నీ తానై సేవలు : సాఫీగా సాగిపోతున్న జీవితంలో ఇలా జరిగిందే అని మారెప్ప కుంగిపోలేదు. అప్పటి నుంచి మారెప్ప భార్య అలనాపాలనా చూస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇంట్లో అన్నీ తానై సేవ చేస్తున్నారు. బయటకు వెళ్లాలంటే ఇలా ఎత్తుకుని వెళ్తుంటారు. తన భార్యకు అధికారులు దివ్యాంగ పింఛన్​తో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని మారెప్ప కోరుతున్నారు.

True love between husband and wife : ప్రస్తుత కాలంలో పరిస్థితులన్నీ బాగున్నప్పటికీ, చిన్న చిన్న కారణాలకే గొడవలు పడి, విడిపోయే భార్యాభర్తలు ఈ జంటను చూసి నేర్చుకోవాలి. ఓ ప్రమాదంలో రెండు కాళ్లూ కోల్పోయిన భార్యకు అన్నీ తానై కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు ఈ భర్త. ఈ క్రమంలో వివాహ బంధానికి సరైన అర్థాన్ని చాటి చెబుతున్నారు ఈ దంపతులు. పూర్తి వివరాల్లోకి వెళితే,

ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయి : హైదరాబాద్​లోని చందానగర్​లో నివసిస్తున్న మారెప్పకు వికారాబాద్​ జిల్లా తాండూరుకు చెందిన అనంతితో 2017లో పెళ్లి జరిగింది. వారికి ఇద్దరమ్మాయిలు ఐశ్వర్య (6), సాక్షి(3) ఉన్నారు. ఈ దంపతులు ఇద్దరూ భవన నిర్మాణ కార్మికులే. చక్కగా సాగిపోతున్న సంసారంలో ఒక్కసారిగా అనుకోని సంఘటన చోటుచేసుకుంది. 2022లో తాండూరులో ట్రైన్ ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు అనంతి కిందపడిపోయింది. దీంతో చక్రాల కింద కాళ్లు నలిగిపోయాయి. ప్రాణాలతో బయటపడిన ఆమెకు డాక్టర్లు రెండు కాళ్లను తొలగించారు.

భార్యకు అన్నీ తానై సేవలు : సాఫీగా సాగిపోతున్న జీవితంలో ఇలా జరిగిందే అని మారెప్ప కుంగిపోలేదు. అప్పటి నుంచి మారెప్ప భార్య అలనాపాలనా చూస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇంట్లో అన్నీ తానై సేవ చేస్తున్నారు. బయటకు వెళ్లాలంటే ఇలా ఎత్తుకుని వెళ్తుంటారు. తన భార్యకు అధికారులు దివ్యాంగ పింఛన్​తో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని మారెప్ప కోరుతున్నారు.

ఇలా కూడా భార్యభర్తల మధ్య మనస్పర్థలు వస్తాయా?

అన్యోన్య దాంపత్యానికి ఆ ఒక్క ఛాన్స్‌ ఇవ్వలేమా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.