Fight Between Customers At Union Bank In Huzurnagar :యూనియన్ బ్యాంకులో ఖాతాదారుల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ చోటు చేసుకుంది. "నువ్వు నన్ను కొడతావా" అంటూ ఓ ఖాతాదారుడు రెచ్చిపోయారు. కానీ అక్కడే ఉన్న బ్యాంకు సిబ్బంది మాత్రం వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. చోద్యం చూస్తూ కూర్చున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే,
కొద్దిపాటి తోపులాట :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో రైతు భరోసా డబ్బులు అన్నదాతల అకౌంట్లో జమ చేసిన విషయం తెలసింది. ఈ డబ్బులను విత్ డ్రా చేసుకునేందుకు, అలాగే నగదు పడ్డాయో లేదో తెలుసుకోవడానికి రైతులు బ్యాంకులకు క్యూ కట్టారు. ఈ సందర్భంలో హుజూర్నగర్లోని యూనియన్ బ్యాంకులో రద్దీ పెరిగింది. ఈ క్రమంలో ఖాతాదారులు డబ్బులు తీసుకోవాడానికి లైన్లో నిలబడ్డారు. ఈ సమయంలో కొద్దిపాటి తొపులాట జరగడంతో ఒకరిని ఒకరు నెట్టుకున్నారు. దీంతో ఖాతాదారుల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ చోటు చేసుకుంది. "నువ్వు నన్ను కొడతావా" అంటూ ఓ ఖాతాదారుడు రెచ్చిపోయారు. కానీ అక్కడే ఉన్న బ్యాంకు సిబ్బంది వారిని వారించే ప్రయత్నం చేయలేదు. చోద్యం చూస్తూ కూర్చున్నారు. ఈ గొడవను గమనిచింన సెక్యూరిటీ కలగజేసుకొని ఖాతాదారుల గొడవ సద్దుమణిగేలా చేశారు. దీంతో బ్యాంకులో గందరగోళ పరిస్థితి నెలకొంది.