తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీకి ముంచుకొస్తున్న తీవ్ర తుపాను - ఆ ఐదు జిల్లాలకు హై అలర్ట్!

బంగాళాఖాతంలో బలపడనున్న అల్పపీడనం - ఆంధ్రప్రదేశ్‌కు తుపాను సూచన- అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Updated : 47 minutes ago

Heavy Rain Alert to Andhra Pradesh
Heavy Rain Alert to Andhra Pradesh (ETV Bharat)

Heavy Rain Alert to Andhra Pradesh :ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా బలపడుతుంది. ప్రస్తుతం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతున్న నేపథ్యంలో తీవ్రంగా అల్పపీడనంతో బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మంగళవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో భారీ వానలు పడే అవకాశమున్నట్లు వివరించింది. భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పడీనం బుధవారానికి(రేపటికి) తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు తెలుపుతున్నారు. ఈ తుపాను ఈనెల 17న చెన్నై సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేశారు.

ముందస్తు చర్యలపై సీఎం సమీక్ష :ఏపీలో భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. రెవెన్యూ, పోలీస్‌, పంచాయతీ రాజ్‌, నీటిపారుదల, ఆర్ ఎండ్‌ బీ, విద్యుత్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఆస్తి, ప్రాణనష్టం లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేశాయన్నారు.

తెలంగాణలో 3 రోజుల పాటు వానలు - ఏ ఏ జిల్లాల్లో వర్షాలు ఉన్నాయో తెలుసా?

విద్యా సంస్థలకు సెలవులు పొడగింపు :అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండో రోజు ఎడతెరిపి లేకుండా జిల్లావ్యాప్తంగా వానలు పడుతున్నాయి. మరో రెండు రోజులు పాటు భారీవర్షాలు కురిసే అవకాశముందని ఇది వరకే వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాల దృష్ట్యా రెండో రోజు కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. వానల దృష్ట్యా 146 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. నెల్లూరు, వెంకటగిరిలో ఎస్​డీఆర్​ఎఫ్​ బృందాలను అధికారులు సిద్ధం చేశారు.

నీట మునిగిన పంటలు : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆనుకున్న ఉన్న హిందూ మహాసముద్రం మీదుగా ఆవర్తనం ఏర్పడి ఏపీవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, విశాఖ, కడప, అన్నమయ్య జిల్లాల్లో పంట పొలాలు నీటమునిగాయి. కొన్ని ప్రాంతాల్లో పలు రోడ్లు జలదిగ్బంధమయ్యాయి. వర్షాలు భారీగా కురుస్తున్న జిల్లాల్లోని పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించారు.

ఏపీని వెంటాడుతున్న అల్పపీడనం - బిక్కుబిక్కుమంటున్న కోస్తా జిల్లాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

Last Updated : 47 minutes ago

ABOUT THE AUTHOR

...view details