Choreographer Jani Master Wife Challenges to Victim :తన భర్త, జానీ మాస్టర్ ప్రతిభను ప్రోత్సహించేవారని, ఎవరికైనా అవకాశాలు రాకుండా ఆయనెందుకు చేస్తారని సుమలత అలియాస్ ఆయేషా అన్నారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ను రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు గురువారం గోవాలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య ఓ మీడియాతో మాట్లాడారు. ఫిర్యాదు చేసిన మహిళ నిజం నిరూపిస్తే భర్తను వదిలేస్తానని ఆయేషా వెల్లడించారు.
హీరోయిన్గా స్థిరపడాలి లేదా కొరియోగ్రాఫర్గా అగ్ర స్థానంలో ఉండాలనేది ఆ అమ్మాయి, ఆమె తల్లి కోరిక అని ఆయేషా తెలిపారు. స్టేజ్ షోల నుంచి వచ్చిన ఆమె, సినీ రంగాన్ని చూసి లగ్జరీ లైఫ్ కావాలని కోరుకునేదని చెప్పారు. తనకే ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వాలని చూస్తుంటుందని పేర్కొన్నారు. మైనర్గా ఉన్నప్పుడే ఘటన జరిగిందనడానికి సాక్ష్యమేంటని, జానీ మాస్టర్తో సాన్నిహిత్యంగా ఉందని ఎవరైనా చూశారా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకూ ఆ అమ్మాయి బయటకొచ్చి మాట్లాడిందా అని అన్నారు.
లైంగిక వేధింపులకు గురైతే ఎందుకు అలా చెప్పింది: అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసినప్పుడు మాట్లాడటానికి ఏమైందని, ఒకవేళ లైంగిక వేధింపులకు గురైతే ‘జానీ మాస్టర్' వద్ద పని చేయడం తన అదృష్టమని నవ్వుతూ ఎందుకు చెబుతోందని ఆయేషా ప్రశ్నించారు. ఆ మాట చెప్పినప్పుడు ఆమె ఇబ్బంది పడినట్లు కనిపించలేదని తెలిపారు. హైదరాబాద్లో అసోషియేషన్ కార్డు పొందేందుకు ఆమె దగ్గర డబ్బులేకపోతే జానీ మాస్టర్యే ముంబయిలో ఇప్పించారని చెప్పారు. తన భర్త పని చేసిన సినిమాలో కొరియోగ్రాఫర్గా కూడా ఆమెకు అవకాశం ఇచ్చారని వెల్లడించారు.