తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో కూటమి గెలుపు - ప్రజావిజయం పేరిట అట్లాంటాలో సంబురాలు - TDP WINNING CELEBRATIONS IN US

TDP Alliance Winning Celebrations in Atlanta : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన బీజేపీ కూటమి సునామీ సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో అమెరికాలోని అట్లాంటాలో తెలుగు వారు, జనసైనికులు కలిసి ప్రజా విజయం పేరిట విజయగర్జన వేడుకలు నిర్వహించారు. జూన్ 22 శనివారం రోజున జార్జియా రాష్ట్రం, అట్లాంటాలోని జేడ్ బాంక్వెట్ హాల్లో ఈ విజయోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున జరిపారు. సాయంత్రం 5 గంటల సమయంలో దాదాపు 500 కార్లతో అతి పెద్ద ర్యాలీ చేశారు.

By ETV Bharat Telangana Team

Published : Jun 24, 2024, 1:40 PM IST

TDP and Janasena Winning Celebrations in Atlanta
TDP Alliance Winning Celebrations in Atlanta (ETV Bharat)

TDP Janasena BJP Winning Celebrations in Atlanta : అమెరికాలోని అట్లాంటాలో ఏపీ కూటమి విజయ సంబురాలు అంబరాన్నంటాయి. అక్కడి తెలుగు ప్రజలు, జనసైనికులు ప్రజావిజయం పేరిట విజయగర్జన వేడుకలు నిర్వహించారు. కూటమి నాయకులకు జై కొడుతూ విదేశీ వీధుల్లో హోరెత్తించారు. పోలీస్ సెక్యూరిటీ భారీ ఎత్తున కార్లతో ర్యాలీ నిర్వహించారు. కూటమి పార్టీల పాటలతో కొందరు కార్లపైకి ఎక్కిమరీ నినాదాలు చేశారు. మాంచి ఆకలి మీద ఉన్న పులికి దొరికిన విందులా ఈ కూటమి విజయాన్ని ఆస్వాదించారు.

తేనీటి విందు అనంతరం మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి డప్పులతో, తీన్మార్ డాన్సులతో వేదిక ప్రాంగణంలోకి ఊరేగింపుగా విచ్చేశారు. వేదిక ప్రాంగణం అంతా కూటమి పార్టీల బ్యానర్లు, జెండాలు, కండువాలతో పసుపు, ఎరుపు రంగుల మయమైంది. ఆహ్వానితులు సైతం పసుపు, ఎరుపు రంగుల వస్త్రాల్లో రావడం విశేషం. అందరూ ఆశీనులైన అనంతరం వ్యాఖ్యాతలు సురేష్ పెద్ది, సురేష్ కరోతు అందరికీ స్వాగతం పలికారు.

ఇండియా నుంచి విచ్చేసిన పెద్దలు, మహిళలతో జ్యోతి ప్రజ్వలను చేసిన తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ఎన్నారై టీడీపీ అట్లాంటా నాయకులు సతీష్ ముసునూరి స్వాగతోపన్యాసం చేశారు. ఇండియా నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు, టీడీపీ, జనసేన లీడర్లు పంపిన పలు వీడియో సందేశాలను ప్రదర్శించారు. వీరందరూ ఎన్నికల సమయంలో ఎన్నారైలు చేసిన కృషిని అభినందించారు. మున్ముందు కూడా ఏపీ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్​లో కూటమి గెలుపు - తెలంగాణలో సంబురాలు చేసుకుంటున్న టీడీపీ శ్రేణులు - Tdp Leaders celebrations in TS

కూర్చోవడానికి కుర్చీలు కూడా సరిపోనంత జనం రావడం ఒక ఎత్తైతే, నుంచొని కూడా కార్యక్రమం ఆసాంతం తిలకించిన ప్రవాసులు మరొక ఎత్తు. పసందైన విందు భోజనం అనంతరం బాణసంచా కాల్చారు. ముందే ఊహించి 2000 మందికి సరిపడా ఏర్పాట్లు చేశారు. అట్లాంటా వాసి, అందరికీ సుపరిచితులు, గుడివాడ గడ్డపై తెలుగుదేశం జెండాని రెపరెపలాడించిన రాము వెనిగండ్ల జూమ్ మీటింగ్ ద్వారా లైవ్‌లోకి వచ్చి అందరినీ ఉత్సాహపరిచారు.

ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ఎన్నారైల సేవలను, ముఖ్యంగా అట్లాంటా వారి సేవలను అభినందించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సాయం కావాలన్నా తనను సంప్రదించవచ్చని అన్నారు. తర్వాత కీ నోట్ స్పీకర్స్ మల్లిక్ మేదరమెట్ల, సురేష్ కరోతు, క్రిష్ణప్రియ తదితరులు ప్రసంగించారు. ఫుడ్ కోఆర్డినేటర్ వేణు దండా ఫుడ్ స్పాన్సర్స్ అందరినీ పేరు పేరునా అభినందించారు. మొట్టమొదటిసారి అట్లాంటా లోని రెస్టారెంట్స్ అన్నీ కలిసికట్టుగా ముందుకు రావడం విశేషం అన్నారు. అనంతరం ఎన్నారై టీడీపీ అట్లాంటా, టీం జనసేన నాయకుల నడుమ కేక్ కట్‌చేసి అందరికీ పంచారు.

రామోజీ రావురి అమెరికాలో నివాళులు :మరోవైపు ఇటీవల కన్నుమూసిన మీడియా మొఘల్, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీ రావుకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు జాతికి చేసిన సేవలను స్మరించుకున్నారు. తర్వాత తరాలకు కూడా ఆయన గురించి తెలిసేలా పలువురు సందేశం ఇచ్చారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.

జిల్లాలకు జిల్లాలే క్లీన్ స్వీప్‌ - భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోన్న కూటమి - Hello AP Bye Bye YCP

ఎన్నికల గెలుపుతో టీడీపీ శ్రేణుల సంబరాలు.. ఘనంగా విజయోత్సవ ర్యాలీలు

ABOUT THE AUTHOR

...view details