తెలంగాణ

telangana

ETV Bharat / state

"కాంగ్రెస్​ పాలనలో కర్షకులకు కష్టాలు - పంటలు పండించడం, విక్రయం కత్తిమీద సామే" - Harish Rao Letter to CM Revanth - HARISH RAO LETTER TO CM REVANTH

Harish Rao Letter to CM Revanth Reddy : రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం కొలువుతీరాక రైతన్నలకు పంటలు పండించడం, విక్రయం కత్తిమీద సాముగా మారిందని బీఆర్ఎస్ సీనియర్​ నేత హరీశ్‌రావు ధ్వజమెత్తారు. మద్దతు ధరకు పంటల కొనుగోలును విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డికి హరీశ్​రావు బహిరంగ లేఖ రాశారు.

Harish Rao Slams Govt Over Crop Purchase
Harish Rao Letter to CM Revanth Reddy (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 28, 2024, 10:28 AM IST

Updated : Aug 28, 2024, 11:30 AM IST

Harish Rao Slams Govt Over Crop Purchase : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. పెసర పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారిందని విమర్శించారు. పెసరకు మద్దతు ధర ప్రకటించినా ఎవరూ కొనుగోలు చేయలేని పరిస్థితి ఉందన్నారు.

ఆహార పంటల బదులు పప్పుధాన్యాల సాగుతో మెరుగైన లాభాలు సాధించవచ్చన్న రైతుల ఆశలు అడియాశలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం శోచనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది క్వింటా పెసరకు మద్దతు ధర రూ. 8,682 ప్రకటించినప్పటికీ ఆ ధరకు ఎవరూ కొనుగోలు చేయని పరిస్థితి నెలకొందన్నారు. దీంతో వ్యవసాయ మార్కెట్లు, గ్రామీణ ప్రాంతాల వ్యాపారులకు పంటను క్వింటా రూ.6,000 నుంచి రూ.6,500 మధ్యనే రైతులు విక్రయిన్నారని వివరించారు.

రుణమాఫీ, రైతుబంధును ప్రభుత్వం అటకెక్కించింది : ప్రైవేటు వ్యాపారులు ఆడిందే ఆటగా మారడంతో అన్నదాతలకు నష్టం జరిగిందని హరీశ్ రావు పేర్కొన్నారు. పంట అమ్మిన తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే దళారులకే లబ్ధి జరుగుతుందని, దాని వల్ల రైతులకు ఎటువంటి ఉపయోగం ఉండని తెలిపారు. రుణమాఫీ, రైతుబంధును ప్రభుత్వం అటకెక్కించిన సర్కార్‌, మద్దతు ధరకు పంటల కొనుగోలును సైతం విస్మరిస్తోందని విమర్శించారు. పంటలు పండించడం, విక్రయం కత్తిమీద సాముగా మారిందని, తక్షణమే జిల్లాల్లో పెసర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని హరీశ్‌రావు లేఖలో సీఎంను డిమాండ్‌ చేశారు.

సీఎం ఇలాకాలో స్కూల్స్​ మూతపడటం సిగ్గుచేటు :ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్​లో ఉపాధ్యాయులు లేక పాఠశాల మూతపడటం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్​రావు ఎక్స్ వేదికగా విమర్శించారు. 15 రోజులుగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారని, ఇప్పుడు ఉన్న ప్రభుత్వ స్కూళ్లను మూతపడేలా చేస్తున్నారని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో పాఠశాలలు మూతపడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు. విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి వద్దే ఉన్నప్పటికీ విద్య పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. తక్షణమే పాఠశాలల్లో విద్యా వాలంటీర్లను నియమించి పాఠశాలను మూతపడకుండా చూడాలని కోరారు. మూతపడ్డ పాఠశాలలను తెరిపించి విద్యా బోధన జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

హైడ్రా పేరిట హైడ్రామా - కాంగ్రెస్‌ కండువా కప్పుకోకపోతే టార్చర్ : హరీశ్​రావు - HARISH RAO SLAMS GOVT OVER HYDRA

కవితకు బెయిల్​ రావడంపై కేటీఆర్​, బండి మధ్య ట్వీట్ వార్ - 'కేంద్రమంత్రి​ ఆ వ్యాఖ్యలు చేయడం తగదు' - kavitha bail KTR and Bandi tweets

Last Updated : Aug 28, 2024, 11:30 AM IST

ABOUT THE AUTHOR

...view details