BRS MLCs Protest in Legislative Council :తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యావాద తీర్మానంపై శాసనమండలిలో వాడీవేడి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల మండలి సభ్యులపై సీఎం రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళ చేపట్టారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్రెడ్డి వెంటనే కౌన్సిల్ సభ్యులకు క్షమాపణలు చెప్పాలని అప్పటి వరకు మండలిని నిర్వహించొద్దని వారు అన్నారు. దీంతో గందరగోళం నెలకొంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి స్పందించారు. కౌన్సిల్ను గులాబీ పార్టీ సభ్యులు అగౌరవపరుస్తున్నారని అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్సీలు చేసిన ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీకి పంపారని, పెద్దల సభలో ఓపిక ఉండాలని సూచించారు. మరోవైపు వారికి ఈ విషయంలో నిరసన చేపట్టే హక్కు లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. అయినా భారత్ రాష్ట్ర సమితి సభ్యులు కౌన్సిల్ పోడియాన్ని చుట్టుముట్టడంతో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి 10 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు.
ప్రజాకాంక్షలు నెరవేరేలా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోంది : గవర్నర్ తమిళిసై