తెలంగాణ

telangana

'రాష్ట్ర ప్రజలకు ప్రతినిధిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి - సభ్యసమాజం తలదించుకునేలా మాట్లాడారు' - BRS MLAS SLAMS CM REVANTH

By ETV Bharat Telangana Team

Published : Aug 15, 2024, 10:41 PM IST

BRS MLAS SLAMS CM REVANTH : రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ప్రతినిధిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ్యసమాజం తలదించుకునేలా మాట్లాడారని బీఆర్ఎస్ శాసనసభ్యులు మండిపడ్డారు. తెలంగాణ సీఎం మాటలు వినరాదని, పక్క రాష్ట్రాల వారు అనుకునేలా వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. రాష్ట్ర ప్రతినిధి ఈ మాటలా మాట్లాడేది అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేశారు.

BRS MLAS FIRES CM REVANTH
BRS MLAS SLAMS CM REVANTH (ETV Bharat)

BRS MLAS SLAMS CM REVANTH :సీతారామ ప్రాజెక్టు ఎనిమిది నెలల్లో పూర్తి చేసే సత్తా ఉంటే, పాలమూరు- రంగారెడ్డి పనులు ఎందుకు చేయలేదని ప్రభుత్వాన్ని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 47 లక్షల మందికి కావాల్సిన రుణమాఫీని కేవలం 22 లక్షల మందికి చేశారని, మిగతా రైతులకు చేయనందుకు అమరవీరుల స్థూపం వద్ద ఎవరు ముక్కు నేలకు రాయాలో ఆలోచించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. తమను ఎంత అవమానించినా తాము ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటామని పేర్కొన్నారు.

అన్ని అవాస్తావాలే : ముఖ్యమంత్రి మాటల్లో అబద్ధాలు, అవాస్తవాలు, బూతులు తప్ప ఇంకోటి లేవని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆక్షేపించారు. 29 రాష్ట్రాల్లోని ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ప్రవర్తించడం లేదని ఆయన దుయ్యబట్టారు. 30 వేలు కాదు, మూడు ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదని, ఎనిమిది నెలల్లో ప్రాజెక్టు సాధ్యం అయితే కొడంగల్-నారాయణపేటలో తట్టెడుమట్టి కూడా ఎందుకు తీయలేదని ఆయన ప్రశ్నించారు.

రుణమాఫీ మొత్తం చేశామని సీఎం పచ్చి అబద్ధం మాట్లాడుతున్నారని, దేశంలోనే అతి పెద్ద మోసమని పల్లా ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్టు వేసి దేవుళ్లను కూడా మోసం చేస్తున్నారని, హరీశ్‌రావు నిఖార్సయిన నాయకుడు, ఉద్యమకారుడని పల్లా తెలిపారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ, ఆరు గ్యారంటీలు సంపూర్ణంగా పూర్తి చేస్తే రాజీనామా చేస్తా అని హరీశ్‌రావు సవాల్ చేశారని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి భాషను పశువులు కూడా సహించవని, ఆయనలో మృగం ఆవహించిందని అందరూ అనుకుంటున్నారని పేర్కొన్నారు.

సీఎం రేవంత్ భాష మార్చుకోవాలి : పాలన చేతకాక ప్రతిపక్షాలను తిడుతూ కాలం గడుపుతున్నారని, సీఎం రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలని ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి సూచించారు. గ్రామాల్లో పారిశుధ్యం పూర్తిగా పడకేసిందని, పట్టణాల్లో పరిస్థితి ఘోరంగా ఉందన్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రజలు ఛీ కొడుతున్నారని ఆయన అన్నారు. హరీశ్‌రావును తిడితే తప్పులు ఒప్పులు కావని, కాంగ్రెస్ పార్టీని అన్నీ వైఫల్యాలే అని మండిపడ్డారు. సీఎం ప్రజలకు క్షమాపణ చెప్పి అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నెలకు రాయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.

"ముఖ్యమంత్రి మాటల్లో అబద్ధాలు, అవాస్తవాలు, బూతులు తప్ప ఇంకోటి లేవు. సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్టు వేసి దేవుళ్లను కూడా మోసం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి భాషను పశువులు కూడా సహించవు ఆయనలో మృగం ఆవహించింది". - పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే

'రుణమాఫీ హామీపై రేవంత్ మాట తప్పారు - రాజీనామా ఎవరు చేయాలో త్వరలోనే తెలుస్తుంది' - Harish Rao TWEET on cm Revanth

'సీఎం రేవంత్​ అలా అనడం మానేయాలి - తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా మాట్లాడొద్దు' - KTR Fires On CM Revanth Reddy

ABOUT THE AUTHOR

...view details