తెలంగాణ

telangana

సనాతన ధర్మంపై దాడి జరిగితే మౌనంగా ఊరుకోవాలా? : పవన్‌ - Pawan Kalyan On Sanatan Dharma

Pawan Kalyan Varahi Declaration: కలియుగంలో ధర్మానికి ప్రతిరూపం వెంకటేశ్వరస్వామి అని తాను సనాతనధర్మాన్ని పాటిస్తే అవహేళన చేసి మాట్లాడారని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏడు కొండలవాడికి అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటామని ఆయన అన్నారు. తిరుపతిలో నిర్వహించిన వారాహి సభలో ఆయన ప్రసంగించారు. తనకు అన్యాయం జరిగినా బయటకు రాలేదు కానీ సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ పెట్టుకోడానికి వచ్చానని పవన్ తెలిపారు.

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Published : 4 hours ago

Updated : 4 hours ago

AP Deputy CM Pawan Kalyan On Sanatan Dharma
Pawan Kalyan Varahi Declaration (ETV Bharat)

AP Deputy CM Pawan Kalyan On Sanatan Dharma : ఏడు కొండలవాడికి అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటామని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన వారాహి సభలో ఆయన ప్రసంగించారు. తనకు అన్యాయం జరిగినా బయటకు రాలేదు కానీ సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ పెట్టుకోడానికి వచ్చానని పవన్ తెలిపారు. నా జీవితంలో ఇలా మాట్లాడే రోజు వస్తుందనుకోలేదన్నారు. తిరుమలలో అపచారం జరుగుతోంది సరిదిద్దండి అని గతంలో తెలిపానన్నారు. సనాతన హైందవ ధర్మానికి మనం గౌరవం ఇవ్వట్లేదని ఇతర మతాలను గౌరవించేదే సనాతన ధర్మం అని పవన్‌ అన్నారు.

కలియుగంలో ధర్మానికి ప్రతిరూపం వెంకటేశ్వరస్వామి అని తాను సనాతన ధర్మాన్ని పాటిస్తే అవహేళన చేసి మాట్లాడారని పవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రాయశ్చిత్త దీక్షను కూడా అవహేళన చేశారని సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటానని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ఈ మధ్య దేశంలో హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా దాడులు జరిగాయని దాడులు జరుగుతుంటే మనం పళ్లబిగువున బాధను భరించాలా అని ప్రశ్నించారు.

హిందూ సమాజంలో ఐక్యత లేకపోవడమే దీనికి కారణమని హిందూ సమాజాన్ని కులాలు, ప్రాంతాల వారీగా విభజించారన్నారు. హిందువులంతా ఏకం కావాల్సిన సమయం వచ్చిందని అన్నారు. హిందూమతం గురించి మాట్లాడాలంటే భయపడే పరిస్థితికి వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. రాముడిని తిడితే నోరెత్తకూడదని మనది లౌకికవాద దేశం అంటారన్నారు. ఇతర మతాల్లో వాళ్ల దేవుడిని తిడితే వదిలేస్తారా అని ప్రశ్నించారు. హిందువులకు అన్యాయం జరిగితే మాట్లాడే హక్కు లేదా అని పవన్ ప్రశ్నించారు.

"సెక్యులరిజం అనే పేరుతో హిందువుల నోరు నొక్కేస్తున్నారు. సనాతనధర్మం, హిందూ దేవుళ్లను విమర్శించేవారు ఎక్కువయ్యారు. ఇస్లాం దేశాల మాటలు సూడో సెక్యులరిస్టులకు వినపడవు. బంగ్లాదేశ్‌ ఇస్లాం రాజ్యంగా ప్రకటించుకుంటే ఎవరూ మాట్లాడరు. సనాతనధర్మానికి రంగు, వివక్ష లేదు. మెకాలే తీసుకువచ్చిన వివక్ష ఇదంతా. సనాతన ధర్మానికి హాని తలపెట్టేవారు జాగ్రత్తగా ఉండాలి." -పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం

పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష విరమణ - శ్రీవారి ఆలయంలో వారాహి డిక్లరేషన్ బుక్‌ - Pawan Kalyan Tirumala Tour

ప్రకాశ్​రాజ్ అలా కామెంట్‌ చేయాల్సిన అవసరం లేదు : పవన్ కల్యాణ్ - Pawan Kalyan VS Prakash Raj

Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details