తెలంగాణ

telangana

'తప్పులు చేసిన వారిని ఆయన ఎలా సమర్థిస్తారు?' : జగన్‌పై పవన్‌ కల్యాణ్ ఫైర్ - AP Deputy CM Pawankalyan Deeksha

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Pawan kalyan Begins 11 Days Deeksha : తిరుమల శ్రీవారి లడ్డూను మహా ప్రసాదంగా భావిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రసాదాన్ని కూడా కల్తీ చేస్తారా? అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. తప్పులు చేసిన వారిని ఎలా సమర్థిస్తారని మాజీ సీఎం జగన్‌ను, పవన్ కల్యాణ్ నిలదీశారు.

Pawan kalyan Prayaschitta Deeksha
Pawan kalyan Begins 11 Days Deeksha (ETV Bharat)

Pawan kalyan Prayaschitta Deeksha : ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తిరుమల లడ్డూ కల్తీపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఇవాళ గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ దీక్షను స్వీకరించారు. అంతకుముందు ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు పూజలు నిర్వహించి, పండితుల ఆశీర్వచనం పొందారు. 11 రోజులపాటు దీక్షను కొనసాగించనున్నారు. దీక్ష పూర్తయ్యాక తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పవన్ కల్యాణ్ దర్శించుకోనున్నారు.

Tirupati Laddu Issue Updates :తిరుమలలో జరిగిన అపచారం అందరికీ తెలిసిందేనని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 300 ఏళ్లకు పైగా తిరుమల లడ్డూ ప్రసాదాన్ని పంచుతున్నారని చెప్పారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. 2019 నుంచి సంస్కరణల పేరుతో వైఎస్సార్సీపీ చాలా మార్పులు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారి పూజా విధానాలను మార్చేశారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.

"శ్రీవాణి ట్రస్టు పేరుతో రూ.10,000లు వసూలు చేశారు. కానీ బిల్లు మాత్రం రూ.500కే ఇచ్చారు. వైఎస్సార్సీపీ పాలనలో ఆలయాలు ధ్వంసమయ్యాయి. రథాలు తగలబెట్టారు ఆలయాలను అపవిత్రం చేశారు. రాముడి విగ్రహంలో తల తొలగిస్తే ఆనాడు పోరాటం చేశాం. ఏ మతమైనా కావచ్చు మనోభావాలు దెబ్బతినకూడదు." - పవన్ కల్యాణ్, ఉప ముఖ్యమంత్రి

వారిని జగన్‌ ఎలా సమర్థిస్తారు? : తిరుమల శ్రీవారి లడ్డూను మహా ప్రసాదంగా భావిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రసాదాన్ని కూడా కల్తీ చేస్తారా అని ఆవేదన కలుగుతోందని చెప్పారు. ఈ స్థాయిలో కల్తీ జరుగుతోందని ఊహించలేదని పేర్కొన్నారు. అపవిత్రం చేస్తే ఏం మాట్లాడకుండా ఉండాలా అని ప్రశ్నించారు. అపవిత్రం జరుగుతోంటే సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి ఏం చేశారని నిలదీశారు. తప్పులు చేసిన వారిని జగన్‌ ఎలా సమర్థిస్తారు? అని విమర్శించారు. కోట్లమంది హిందువులు స్వీకరించే ప్రసాదాన్ని అపవిత్రం చేస్తారా? అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

"వేదన కలిగినప్పుడు పోరాడతాం. ఏ మతంపై దాడి జరిగినా ఇలాగే స్పందిస్తాం. పరస్పర విశ్వాసాలను గౌరవించుకోవాలి. దోషులకు కఠిన శిక్ష పడాల్సిందే. కేబినెట్‌ భేటీలో, అసెంబ్లీలో చర్చ జరగాలి. నెయ్యి ఎందుకు తక్కువ ధరకు వస్తుందోనని ఆలోచించరా. కల్తీ నెయ్యి విషయం తెలిసీ కొంతమంది భయపడి చెప్పలేదా. టీటీడీలో ఇంతమంది ఉద్యోగులు ఉంటే ఎవరికీ తెలియదా' అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

తిరుపతి లడ్డూ నాణ్యత పునరుద్ధరించిన టీటీడీ - ఇక నో టెన్షన్​ - TTD Laddu Updates

శ్రీవారి భక్తులకు శుభవార్త - తిరుమల లడ్డూకు మళ్లీ నందిని నెయ్యి - కిలో ఎంతో తెలుసా? - Nandini Ghee to Tirupati Laddu

ABOUT THE AUTHOR

...view details