తెలంగాణ

telangana

విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్​ వద్ద ఏబీవీపీ ఆందోళన - పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ - ABVP Leaders Protest

By ETV Bharat Telangana Team

Published : Jun 28, 2024, 2:05 PM IST

ABVP Leaders Protest In Hyderabad : ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలు తీర్చాలంటూ ఏబీవీపీ నాయకులు విద్యా కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకునే క్రమంలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.

ABVP Leaders Protest at Education Commissioner Office
ABVP Leaders Protest at Education Commissioner Office (ETV Bharat)

ABVP Leaders Protest at Education Commissioner Office :రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాంటూ ఏబీవీపీ నాయకులు విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో కార్యాలయం చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. లోనికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పరిస్థితి విషమించడంతో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీతో పాటు పలువురు నాయకులను అరెస్టు చేశారు.

ఈ క్రమంలో పోలీసులకు, నాయకులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సంవత్సరాల తరబడి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలు లేక విద్యార్థులు సరిగ్గా చదవలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు, సరిపడా అధ్యాపకులు లేక నానా అవస్థలు పడుతున్నారని చెప్పారు.

ఏబీవీపీ నిరసనలో పోలీసుల ఓవరాక్షన్ - మహిళ కార్యకర్త జుట్టుపట్టుకొని

"తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతుంది. అయినా ప్రభుత్వం విద్యార్థుల కోసం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవు. ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టడం లేదు. కనీస సౌకర్యాలు కూడా లేనిచోట విద్యార్థులు ఎలా చదువుకుంటారు." - విద్యార్థి నాయకులు

ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు రూ.లక్షలకు లక్షలు ఫీజులు దండుకుంటుంటే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం కేవలం చర్యలు తీసుకుంటామంటూ హామీలు ఇస్తూ, తర్వాత చేతులు దులుపుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడిన ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటామంటూ, ఫీజు నియంత్రణ చట్టం అమలు చేస్తామంటూ హామీలు ఇస్తున్నారు తప్ప అమలు చేయడం లేదన్నారు.

కిషన్‌ రెడ్డి ఇంటి ముట్టడి :ఇదిలా ఉండగానీట్‌ సమస్యపైన ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నీట్‌ పరీక్ష లీకేజీ, అవకతవకపై ఎన్టీఏను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసన తెలిపారు. కేంద్ర మంత్రి ఇంటిని ముట్టడించానికి ప్రయత్నించిన విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకుని కాచిగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Clash at Srinidhi University Viral Video : ఏబీవీపీ నేతలు, శ్రీనిధి కళాశాల సెక్యూరిటీ సిబ్బంది డిష్యుం.. డిష్యుం.. వీడియో వైరల్

ABVP Protest at Higher Education Office : ఆ కళాశాలల గుర్తింపు రద్దు చేయాలంటూ ఏబీవీపీ ధర్నా

ABOUT THE AUTHOR

...view details