Woman Killed Her Husband in Hyderabad : ఆమెకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. డబ్బు మీద అత్యాశతో ఆస్తి కోసం ప్రియుడితో కలిసి మూడో భర్తను హత్య చేసింది. హైదరాబాద్లో చంపేసి మృతదేహాన్ని కారులో కర్ణాటకకు తరలించి అక్కడ దహనం చేసింది. కర్ణాటక పోలీసుల దర్యాప్తులో విషయం బయటపడటంతో ఆమెతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన నిహారిక (29) వరుసగా పెళ్లిళ్లు చేసుకుని వారికి విడాకులిచ్చింది. మొదటి పెళ్లి బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్తో జరగగా, రెండో పెళ్లి హరియాణాకు చెందిన వ్యక్తితో అయ్యింది.
హరియాణాకు చెందిన రెండో భర్త పెట్టిన కేసులో జైలుకు వెళ్లగా, ఆమెకు అక్కడ మరో మహిళా ఖైదీతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమె కుమారుడు రాణాతో ప్రేమలో పడింది. అనంతరం కర్ణాటకలోని బెంగళూరుకు మకాం మార్చింది. అనంతరం మాట్రిమోనీ వేదిక ద్వారా హైదరాబాద్ తుకారాంగేట్కు చెందిన స్థిరాస్తి వ్యాపారి రమేశ్ కుమార్తో పరిచయం ఏర్పర్చుకుంది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నానని చెప్పి ముగ్గులోకి దింపింది.
అనుమానంతోనే? : రమేశ్కు అప్పటికే భార్య, కుమార్తె ఉన్నారు. అయినా ఇద్దరూ 2018లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఘట్కేసర్ సమీపంలోని పోచారం సంస్కృతి టౌన్షిప్లో కాపురం పెట్టారు. ఉద్యోగం పేరిట నిహారిక బెంగళూరుకు వెళ్లి వచ్చేది. ఈ క్రమంలో నిహారిక ఈ నెల (అక్టోబర్)4న పోచారానికి రాగా, అప్పటికే ఆమె తీరుపై అనుమానం వచ్చిన రమేశ్ కుమార్ నిలదీయడంతో వివాదం మొదలైంది. ఇంటి నుంచి బయటికి వెళ్లిన నిహారిక ప్రియుడు రాణాను వెంటబెట్టుకొని తిరిగొచ్చింది.