తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్ పేరిట మరో చెత్త రికార్డు - ధోనీ, సచిన్, దాదా సరసన హిట్​మ్యాన్

న్యూజిలాండ్​తో జరిగిన తొలి టెస్ట్​ ఓటమితో సచిన్, ధోనీ, గంగూలీ చెత్త రికార్డును సమం చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ

By ETV Bharat Sports Team

Published : 6 hours ago

Rohith Sachin Dhoni Ganguly
Rohith Sachin Dhoni Ganguly (source IANS and Getty Images)

స్వదేశంలో న్యూజిలాండ్​తో జరిగిన తొలి టెస్టులో టీమ్ ఇండియా ఓడిపోయింది. దీంతో 12 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఒకే క్యాలెండర్ ఇయర్​లో సొంత గడ్డపై టీమ్ ఇండియా రెండు టెస్టుల్లో ఓటమిపాలైంది. అలాగే 36 ఏళ్ల తర్వాత భారత్‌లో కివీస్‌ తొలి టెస్టు గెలిచింది. ఇలా ఈ టెస్టు మ్యాచ్ ఓటమితో భారత్ పలు పేలవమైన రికార్డులు నమోదు చేసింది. అలాగే రోహిత్ శర్మ కూడా ఓ చెత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. అదేంటంటే?

రోహిత్ కెప్టెన్సీలో మూడు ఓటములు

రోహిత్ కెప్టెన్సీలో స్వదేశంలో భారత్ ఇప్పటివరకు మూడు టెస్టుల్లో ఓడిపోయింది. రోహిత్​తో పాటు ఎంఎస్ ధోనీ, సౌరభ్ గంగూలీ, సచిన్ తెందూల్కర్, బిషన్ సింగ్ బేడీ వంటి దిగ్గజాల కెప్టెన్సీలో కూడా భారత్ మూడు టెస్టుల్లో ఓటమిపాలైంది. అత్యధికంగా మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఆధ్వర్యంలో భారత్ 9 టెస్టుల్లో ఓటమిచవిచూసింది.

  • మన్సూర్ అలీఖాన్ పటౌడీ-9
  • మహ్మద్ అజారుద్దీన్- 4
  • కపిల్ దేవ్- 4
  • రోహిత్ శర్మ-3
  • బిషన్ బేడీ-3
  • ఎంఎస్ ధోనీ-3
  • సౌరభ్ గంగూలీ-3
  • సచిన్ తెందూల్కర్ -3

ఒకే క్యాలెండర్ ఇయర్ రెండు ఓటములు

2012లో టీమ్ ఇండియా ఒకే క్యాలెండర్ ఇయర్​లో స్వదేశంలో రెండు టెస్టులు ఓడిపోయింది. మళ్లీ 12 ఏళ్ల తర్వాత 2024లోనూ అదే సీన్ రిపీట్ అయ్యింది. ఈ ఏడాది జనవరిలో ఇంగ్లాండ్​తో జరిగిన ఐదు మ్యాచ్​ల సిరీస్‌ లో మొదటి టెస్టులో టీమ్ ఇండియా 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. తాజాగా కివీస్ తో జరిగిన టెస్టులో పరాజయంపాలైంది.

అలాగే స్వదేశీ గడ్డపై ఓడిన మ్యాచ్​లో సెకండ్ ఇన్సింగ్స్​లో టీమ్ ఇండియా అత్యధిక స్కోరు చేసింది మాత్రం బెంగళూరులో కివీస్​తో జరిగిన మ్యాచ్ లోనే. ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్​లో భారత జట్టు 462 పరుగులు చేసింది. 2005లో బెంగళూరులో పాకిస్థాన్‌ పై భారత్ 449 పరుగులు చేసింది. తాజాగా ఆ స్కోరును ఆధిగమించింది.

36ఏళ్ల తర్వాత భారత గడ్డపై కివీస్ విజయం

భారత గడ్డపై ఇప్పటివరకు కివీస్ 37 టెస్టులు ఆడగా, అందులో మూడు గెలిచింది. 1988లో వాంఖడేలో గెలుపు తర్వాత భారత గడ్డపై కివీస్ టెస్టుల్లో విజయం సాధంచలేదు. తాజాగా బెంగళూరు టెస్టులో జయకేతనం ఎగురవేసింది. అంటే 36 ఏళ్ల తర్వాత కివీస్​కు భారత గడ్డపై విజయం దక్కింది. అలాగే 2000 తర్వాత భారత్ గడ్డపై నాలుగో ఇన్సింగ్స్​లో విదేశీ జట్టు 100పరుగుల కన్నా ఎక్కువ లక్ష్యాన్ని ఎప్పుడూ ఛేదించలేదు. ఆ రికార్డును తాజా విజయంతో కివీస్ బద్దలుకొట్టింది.

కివీస్- భారత్ తొలి టెస్టు స్కోరు వివరాలు :

  • భారత్ తొలి ఇన్నింగ్స్‌: 46 ఆలౌట్
  • న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 402 పరుగులు
  • భారత్ రెండో ఇన్నింగ్స్‌: 462 పరుగులు
  • న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 110/2

పంత్ రెండో టెస్ట్ ఆడుతాడా? - అతడి గాయంపై మాట్లాడిన రోహిత్!

వాషింగ్టన్ సుందర్‌ ఎంపిక వెనుక గంభీర్ ప్లానింగ్‌ ఇదే!

ABOUT THE AUTHOR

...view details