తెలంగాణ

telangana

పీవీ సింధు బోణీ- మాల్దీవులు ప్లేయర్​​పై ఈజీ విన్ - PV Sindhu Paris Olympics 2024

By ETV Bharat Telugu Team

Published : Jul 28, 2024, 1:34 PM IST

PV Sindhu Paris Olympics 2024 : పారిస్‌ ఒలింపిక్స్‌ పోటీల్లో భాగంగా నిర్వహించిన బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌లో పీవీ సింధు గెలిచింది. మాల్దీవులకు చెందిన ఫాతిమా నబాన అబ్దల్‌ రజాఖ్‌పై ఆమె విజయం సాధించింది. 21-9, 21-6 తేడాతో సింధు గెలిచింది.

PV Sindhu Paris Olympics 2024
PV Sindhu Paris Olympics 2024 (ANI)

PV Sindhu Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత స్టార్‌ షట్లర్ పీవీ సింధు అదరగొట్టింది. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ తొలి మ్యాచ్‌లో మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి అబ్దుల్ రజాక్‌పై అలవోకగా విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో రజాక్‌, సింధుకు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. సింధు ఆటలో పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ, 21-9, 21-6 తేడాతో ప్రత్యర్థిని చిత్తుగా ఓడించింది. దీంతో ఈ మ్యాచ్ కేవలం 29 నిమిషాల్లోనే ముగిసింది.

ఈజీ విన్
తొలి సెట్​ను కేవలం 13 నిమిషాల్లో ముగించిన సింధు, రెండో గేమ్‌ లోనూ అదే దూకుడును చూపించింది. రెప్పపాటు వ్యవధిలోనే తొలి నాలుగు పాయింట్లను చేజిక్కించుకుంది. ఆ తర్వాత రజాక్ పుంజుకోవడం వల్ల పాయింట్ల మధ్య వ్యత్యాసం తగ్గింది. ఆ తర్వాత సింధు మరోసారి పుంజుకుని 10-3కి గ్యాప్ ను పెంచింది. దీంతో మ్యాచ్ ఏకపక్షంగా మారి 21-6 తేడాతో గెలుపొందింది. ఇప్పటికే రెండు ఒలింపిక్ పతకాలను ఖాతాలో వేసుకున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మూడో మెడల్ పై కన్నేసింది. పారిస్ ఒలింపిక్స్​లో మూడో ఒలింపిక్ పతకాన్ని గెలవాలని కసిగా రాణిస్తోంది.

ఒలింపిక్ విజేతతో సింధు ఢీ
2016 రియో ఒలింపిక్స్ లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత క్రిస్టినా కూబాతో గ్రూప్‌ స్టేజ్‌ లో బుధవారం పీవీ సింధు తలపడనుంది. క్రిస్టినా కూబా ఎస్టోనియాకు చెందిన క్రీడాకారిణి. ఈ మ్యాచ్ లో విజయం పీవీ సింధు విజయం సాధిస్తే ఒలింపిక్ మెడల్ సాధించడంలో మరో అడుగు ముందుకు పడినట్లే.

రోయింగ్‌లో క్వార్టర్స్‌కు బాల్‌ రాజ్‌
రోయింగ్‌ లోని రిపెఛేజ్‌ విభాగంలో భారత అథ్లెట్ బాల్‌ రాజ్‌ పన్వార్ సత్తా చాటాడు. రెండో రౌండ్‌ లో అద్భుత ప్రదర్శనతో క్వార్టర్‌ ఫైనల్స్‌ కు చేరాడు. భారత అథ్లెట్ బాల్ రాజ్ పన్వార్ 7 నిమిషాల 12 సెకన్లు, మంగోలియా ఆటగాడు క్వెంటిన్ ఆంటోగ్నెల్లిని 7 నిమిషాల 10 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు. దీంతో మంగోలియా అథ్లెట్‌ క్వింటిన్ ఆంటోగ్నెల్లి తొలి స్థానం సాధించగా, రెండో స్థానంతో బాల్‌ రాజ్‌ క్వార్టర్స్‌ కు దూసుకెళ్లాడు.

ఫైనల్​కు మను బాకర్- బ్యాడ్మింటన్​లో లక్ష్య, సాత్విక్- చిరాగ్ అదుర్స్- భారత్ డే 1 హైలైట్స్ ఇవే! - Paris Olympics 2024

బ్యాడ్మింటన్​లో భారత్ శుభారంభం- లక్ష్యసేన్, సాత్విక్- చిరాగ్ జోడీ విజయం

ABOUT THE AUTHOR

...view details