Paris Olympics July 27 Events :పారిస్లో ఒలింపిక్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దీంతో ఆయా ఈవెంట్లకు శుభారంభం పలికారు క్రీడాకారులు. ఇప్పటికే పలు గేమ్స్లో మన భారత ప్లేయర్లు సత్తా చాటాగా, ఈ పతక వేటలో తమ ట్యాలెంట్ చూపించేందుకు షూటింగ్ స్టార్స్ సిద్ధమయ్యారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్లో లక్ష్యంగా షూటర్లు బరిలో దిగుతున్నారు. వీటితోపాటు టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, రోయింగ్, టెన్నిస్, బాక్సింగ్, హాకీలోనూ పోటీలు జరగనున్నాయి.
తొలి రోజు షూటింగ్ ఈవెంట్లో మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో రమిత- అర్జున్ బబుతా, ఎలవెనిల్ వలరివన్- సందీప్ సింగ్ జోడీలు బరిలో దిగనుంది. ముందుగా క్వాలిఫికేషన్ రౌండ్లో ఈ రెండు జంటలు పోటీపడతనున్నాయి. ఇందులో అత్యుత్తమ పెర్ఫామెన్స్ చేసిన టీమ్కు పతక రౌండ్లకు అర్హత సాధించే అవకాశాలుంటాయి. ఇక ఈ ఈవెంట్కు సంబంధించిన కాంస్య, స్వర్ణ పతక పోటీలు కూడా శనివారమే జరగనున్నాయి. ఒలింపిక్స్కు ముందే మన షూటర్లు మెరుగైన మంచి ఫామ్ కనబరిచారు. ఈ క్రీడల్లోనూ నిలకడ కొనసాగిస్తే మొదటి రోజే భారత్ ఖాతాలో తొలి పతకం రావొచ్చు.
ఇక 10మీ. ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్లోని పురుషుల్లో అర్జున్ చీమా, సరబ్జోత్ సింగ్ అలాగే మహిళా ప్లేయర్లలో రిథమ్ సంగ్వాన్, మను బాకర్ షూటింగ్ రేంజ్లో అడుగుపెట్టనున్నారు. వివిధ ప్రపంచ పోటీల్లో అద్భుతమై పెర్ఫామెన్స్తో ఆకట్టుకున్న మను గత ఒలింపిక్స్లో నిరాశపరిచింది. దీంతో ఈ సారి తానేంటో నిరూపించుకునేందుకు సిద్ధమైంది. ఇక మన షూటర్లకు ప్రధానంగా చైనా నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయి. అయితే భారత చెఫ్ డి మిషన్గా ఉన్న షూటర్ నారంగ్ యంగ్ ప్లేయర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు.
బాక్సింగ్ పోటీలు కూడా శనివారమే ప్రారంభం కానున్నాయి. దీంతో క్రీడాభిమానుల కళ్లు డిఫెండింగ్ ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్పైనే ఉంది. అయితే ఆమెతో పాటు గత క్రీడల కాంస్య విజేత లవ్లీనా బొర్గోహెయిన్పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వీళ్లతో పాటు మరో ఆరుగురు భారతీయులు పారిస్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
అయితే నిఖత్ సహా ఎక్కువ మందికి భారత బాక్సర్లకు కఠినమైన డ్రా ఎదురైంది. రక్సత్ (థాయ్లాండ్), వు యు (చైనా), సబీనా (ఉజ్బెకిస్థాన్)లు నిఖత్లాగే మంచి ఫామ్లో ఉన్నారు. ఆదివారం మ్యాక్సీ (జర్మనీ)తో పోరుతో నిఖత్ తన పతక వేట ప్రారంభం కానున్నాయి. లవ్లీనా (69 కేజీ) తన తొలి రౌండ్లో సునివా (నార్వే) పోటీపడనున్నారు. జైస్మైన్ లంబోరియా (57కేజీ), ప్రీతి పన్వర్ (54 కేజీ), కూడా ఈ భారత్ తరఫున బాక్సింగ్ రింగ్లోకి దిగనున్నారు. పురుషుల విభాగంలో నిశాంత్ దేవ్ (71కేజీ), అమిత్ పంఘాల్ (51కేజీ)లకు తొలి రౌండ్లో బై లభించింది.