ETV Bharat / sports

టెస్టు క్రికెట్​లో అత్యధిక పార్ట్​నర్​షిప్​ నమోదు చేసిన జోడీలివే! - టాప్​లో ఎవరున్నారంటే? - Longest Partnership in Test Cricket

author img

By ETV Bharat Sports Team

Published : Sep 16, 2024, 7:11 PM IST

Longest Partnership in Test Cricket : మరో రెండు రోజుల్లో భారత్ - బంగ్లా టెస్ట్ సిరీస్​ జరగనుంది. అయితే టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన టాప్- 5 జోడీలేవో తెలుసా? దాని గురించే ఈ కథనం.

source Getty Images
Longest Partnership in Test Cricket (source Getty Images)

Longest Partnership in Test Cricket : క్రికెట్​లో టెస్టులను సుదీర్ఘమైన ఫార్మాట్​గా అభివర్ణిస్తారు. ఎందుకంటే ఈ ఫార్మాట్​లో మ్యాచ్ ఫలితం తేలడానికి ఐదు రోజుల సమయం పడుతుంది. కొన్నిసార్లు వేగంగా ఫలితం తేలిపోవచ్చు. అయితే టెస్టుల్లో బ్యాటర్లు బంతులను స్వేచ్ఛగా ఆడొచ్చు. ఈ క్రమంలో భారీ భాగస్వామ్యాలు నెలకొల్పొచ్చు. అయితే మరో రెండు రోజుల్లో భారత్ - బంగ్లా టెస్ట్ సిరీస్​ జరగనుంది. ఈ నేపథ్యంలో టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత ఎక్కువ పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ఐదు జోడీలేవో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కుమార్ సంగక్కర- మహేల జయవర్ధనే : టెస్టు క్రికెట్​లో అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన రికార్డు శ్రీలంక మాజీ క్రికెటర్లు కుమార సంగక్కర, మహేల జయవర్ధనే పేరిట ఉంది. ఈ జోడీ 2006లో కొలంబో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచులో మూడో వికెట్​కు 624 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఈ పార్ట్​నర్​షిప్​లో జయవర్ధనే 374, సంగక్కర 287 పరుగులు చేశాడు. ఈ మ్యాచులో శ్రీలంక ఇన్నింగ్స్, 153 పరుగుల తేడాతో విజయం సాధించింది.

సనత్ జయసూర్య- రోషన్ మహానామా : టెస్టు క్రికెట్​లో రెండో అత్యధిక పార్టనర్ షిప్ రికార్డు శ్రీలంక మాజీ క్రికెటర్లు సనత్ జయసూర్య, రోషన్ మహానామా పేరిట ఉంది. వీరిద్దరూ 1997లో కొలంబో వేదికగా భారత్​తో జరిగిన టెస్టులో రెండో వికెట్​కు 576 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇందులో జయసూర్య 340 , రోషన్ 225 పరుగులు చేశారు. ఈ మ్యాచులో శ్రీలంక మొత్తం 952 పరుగులు చేసింది.

మార్టిన్ క్రో- ఆండ్రూ జోన్స్ : టెస్టుల్లో మూడో అత్యధిక భాగస్వామ్యాన్ని న్యూజిలాండ్ మాజీ బ్యాటర్లు మార్టిన్ క్రో, ఆండ్రూ జోన్స్ నెలకొల్పారు. ఈ జోడి 1991లో వెల్లింగ్టన్ వేదికగా జరిగిన టెస్టులో శ్రీలంకపై మూడో వికెట్​కు 467 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇందులో మార్టిన్ 299, జోన్స్ 186 పరుగులు చేశారు.

డాన్ బ్రాడ్‌ మన్- బిల్ పోన్స్‌ ఫోర్డ్ : టెస్ట్ క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక భాగస్వామ్యం ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజాలు డాన్ బ్రాడ్‌ మన్, బిల్ పోన్స్‌ ఫోర్డ్ పేరిట ఉంది. వీరిద్దరూ 1934లో ఇంగ్లాండ్​పై రెండో వికెట్​కు 451 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యంలో బిల్ పోన్స్‌ ఫోర్డ్ 266, డాన్ బ్రాడ్‌ మన్ 244 పరుగులు చేశారు.

జావేద్ మియాందాద్- ముదస్సిర్ నాజర్ : పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు జావేద్ మియాందాద్, ముదస్సిర్ నాజర్ 1983లో భారత్​పై 451 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ పార్ట్​నర్​షిప్​లో జావేద్ 280, ముదస్సిర్ 231 పరుగులు చేశారు.

సిరీస్​పై టీమ్​ఇండియా నజర్​ - భారత్ నుంచి బంగ్లాకు ఎదురయ్యే 3 సవాళ్లు ఇవే! - 3 Biggest Challenges For Bangladesh

కాలర్ పట్టుకుని ట్రక్ డ్రైవర్​తో గంభీర్ గొడవ! - అసలేం జరిగిందంటే? - Gambhir Fight with Truck Driver

Longest Partnership in Test Cricket : క్రికెట్​లో టెస్టులను సుదీర్ఘమైన ఫార్మాట్​గా అభివర్ణిస్తారు. ఎందుకంటే ఈ ఫార్మాట్​లో మ్యాచ్ ఫలితం తేలడానికి ఐదు రోజుల సమయం పడుతుంది. కొన్నిసార్లు వేగంగా ఫలితం తేలిపోవచ్చు. అయితే టెస్టుల్లో బ్యాటర్లు బంతులను స్వేచ్ఛగా ఆడొచ్చు. ఈ క్రమంలో భారీ భాగస్వామ్యాలు నెలకొల్పొచ్చు. అయితే మరో రెండు రోజుల్లో భారత్ - బంగ్లా టెస్ట్ సిరీస్​ జరగనుంది. ఈ నేపథ్యంలో టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత ఎక్కువ పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ఐదు జోడీలేవో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కుమార్ సంగక్కర- మహేల జయవర్ధనే : టెస్టు క్రికెట్​లో అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన రికార్డు శ్రీలంక మాజీ క్రికెటర్లు కుమార సంగక్కర, మహేల జయవర్ధనే పేరిట ఉంది. ఈ జోడీ 2006లో కొలంబో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచులో మూడో వికెట్​కు 624 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఈ పార్ట్​నర్​షిప్​లో జయవర్ధనే 374, సంగక్కర 287 పరుగులు చేశాడు. ఈ మ్యాచులో శ్రీలంక ఇన్నింగ్స్, 153 పరుగుల తేడాతో విజయం సాధించింది.

సనత్ జయసూర్య- రోషన్ మహానామా : టెస్టు క్రికెట్​లో రెండో అత్యధిక పార్టనర్ షిప్ రికార్డు శ్రీలంక మాజీ క్రికెటర్లు సనత్ జయసూర్య, రోషన్ మహానామా పేరిట ఉంది. వీరిద్దరూ 1997లో కొలంబో వేదికగా భారత్​తో జరిగిన టెస్టులో రెండో వికెట్​కు 576 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇందులో జయసూర్య 340 , రోషన్ 225 పరుగులు చేశారు. ఈ మ్యాచులో శ్రీలంక మొత్తం 952 పరుగులు చేసింది.

మార్టిన్ క్రో- ఆండ్రూ జోన్స్ : టెస్టుల్లో మూడో అత్యధిక భాగస్వామ్యాన్ని న్యూజిలాండ్ మాజీ బ్యాటర్లు మార్టిన్ క్రో, ఆండ్రూ జోన్స్ నెలకొల్పారు. ఈ జోడి 1991లో వెల్లింగ్టన్ వేదికగా జరిగిన టెస్టులో శ్రీలంకపై మూడో వికెట్​కు 467 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇందులో మార్టిన్ 299, జోన్స్ 186 పరుగులు చేశారు.

డాన్ బ్రాడ్‌ మన్- బిల్ పోన్స్‌ ఫోర్డ్ : టెస్ట్ క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక భాగస్వామ్యం ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజాలు డాన్ బ్రాడ్‌ మన్, బిల్ పోన్స్‌ ఫోర్డ్ పేరిట ఉంది. వీరిద్దరూ 1934లో ఇంగ్లాండ్​పై రెండో వికెట్​కు 451 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యంలో బిల్ పోన్స్‌ ఫోర్డ్ 266, డాన్ బ్రాడ్‌ మన్ 244 పరుగులు చేశారు.

జావేద్ మియాందాద్- ముదస్సిర్ నాజర్ : పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు జావేద్ మియాందాద్, ముదస్సిర్ నాజర్ 1983లో భారత్​పై 451 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ పార్ట్​నర్​షిప్​లో జావేద్ 280, ముదస్సిర్ 231 పరుగులు చేశారు.

సిరీస్​పై టీమ్​ఇండియా నజర్​ - భారత్ నుంచి బంగ్లాకు ఎదురయ్యే 3 సవాళ్లు ఇవే! - 3 Biggest Challenges For Bangladesh

కాలర్ పట్టుకుని ట్రక్ డ్రైవర్​తో గంభీర్ గొడవ! - అసలేం జరిగిందంటే? - Gambhir Fight with Truck Driver

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.