IND vs PAK Champions Trophy : 2025 ఛాంపియన్స్ ట్రోఫీ నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో పాకిస్థాన్- న్యూజిలాండ్ తలపడనున్నాయి. అయితే ఐసీసీ టోర్నీ ఏదైనా సరే భారత్- పాకిస్థాన్ మ్యాచ్కు ఉండే హైప్ వేరు. ఫిబ్రవరి 23న దుబాయ్లో జరగనున్న ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తుంది. ఐసీసీ ఈవెంట్లలో పాక్పై ఆధిపత్యం చెలాయిస్తున్న భారత్ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదే రిపీట్ చేయాలని భావిస్తోంది.
మరోవైపు ఈసారి ఎలాగైనా తమ జట్టు భారత్ను ఓడించాలని పాక్ అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. అలాగే పాకిస్థాన్ గడ్డపై మ్యాచ్ అడేందుకు బీసీసీఐ ఒప్పుకోకపోవడం వల్ల ఆ దేశ అభిమానులు నిరాశ చెందారు. దీంతో పాక్ ప్లేయర్లకు అక్కడి ఫ్యాన్స్ బలమైన సందేశం పంపించారు. భారత్తో మ్యాచ్ సందర్భంగా వాళ్లతో ఫ్రెండ్షిప్ పక్కనపెట్టాలని హెచ్చరించారు. అలాగే విరాట్ కోహ్లీ సహా, టీమ్ఇండియా ప్లేయర్లెవరినీ కూడా హగ్ చేసుకోవద్దని చెప్పారు. ఈ మేరకు పాక్ జర్నలిస్ట్ ఒకరు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. ప్రస్తుతం ఇది వైరల్గా మారింది.