తెలంగాణ

telangana

ETV Bharat / sports

గుజరాత్ టైటాన్స్​లో బిగ్ ఛేంజ్!- ఐపీఎల్ 2025 కంటే ముందు కొత్త ఓనర్ చేతిలోకి! - GUJRAT TITANS IPL 2025

ఐపీఎల్​కు ముందు బిగ్ ఛేంజ్! - గుజరాత్ టైటాన్స్​ను కొనుగోలు చేయనున్న ప్రముఖ MNC!

Gujrat Titans IPL 2025
Gujrat Titans IPL 2025 (IANS Photo)

By ETV Bharat Sports Team

Published : Feb 11, 2025, 5:50 PM IST

Gujrat Titans IPL 2025 :ఐపీఎల్ ప్రాంఛైజీల్లో గుజ‌రాత్ టైటాన్స్ ఒక‌టి. 2021లో సీవీసీ క్యాపిటల్ పార్ట్ నర్స్ (ఇరేలియా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్) గుజ‌రాత్ టైటాన్స్​ను కొనుగోలు చేసింది. 2022 సీజ‌న్‌లో ఈ జ‌ట్టు ఐపీఎల్​లో ఎంట్రీ ఇచ్చింది. అయితే తాజాగా సీవీసీ క్యాపిట‌ల్ పార్ట్​నర్స్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా సమాచారం. దాదాపు 67 శాతం వాటాను విక్ర‌యించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ వాటాను భార‌త వ్యాపార సంస్థ టోరెంటో కొనుగోలు చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

"టొరెంట్ గ్రూప్ గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీలో మూడింట రెండు వంతులు (67 శాతం) కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోంది. సీవీసీ క్యాపిటల్ పార్ట్​నర్స్ ఓనర్ షిప్ 4ఏళ్ల లాక్ ఇన్ పీరియడ్ (అగ్రిమెంట్) 2025 ఫిబ్రవరితో ముగుస్తుంది. ఆ తర్వాత వారు వాటాలను స్వేచ్ఛగా విక్రయించుకోవచ్చు. టొరెంట్ గ్రూప్ భారతదేశంలోని ఫార్మాస్యూటికల్ రంగంలో ప్రముఖమైనది. 2021లో బీసీసీఐ రెండు కొత్త జట్ల కోసం బిడ్లను ఆహ్వానించినప్పుడు టొరంట్ గ్రూప్ ఆసక్తి కనబరించింది. యాజమాన్య మార్పుకు బీసీసీఐ ఆమోదం అవసరం. రాబోయే రోజుల్లో బీసీసీఐ అప్రూవల్ లభిస్తుంది." అని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి

టొరెంట్ గ్రూప్ దాదాపు రూ. 41,000 కోట్ల విలువను కలిగి ఉంది. 2021లోనే రెండు ఐపీఎల్ ఫ్రాంచైజీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపింది. గుజరాత్ (రూ. 4,653 కోట్లు), లఖ్ నవూ (రూ. 4,356 కోట్లు) వేలం వేశాయి.

గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ ఐపీఎల్ లో అడుగుపెట్టగానే రాణించింది. 2022 మొదటి సీజన్​లోనే హార్దిక్‌ పాండ్య నేతృత్వంలో టైటిల్​ను గెలుచుకుంది. మరుసటి ఏడాదిలోనూ పైనల్​కు చేరి రన్నరప్​తో సరిపెట్టుకుంది. ఐపీఎల్ 2024కి ముందు గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్ ను ముంబయి ఇండియన్స్‌ కొనుగోలు చేసింది. దీంతో యాజమాన్యం కెప్టెన్సీ బాధ్యతలను యంగ్ బ్యాటర్ శుభ్​మన్​ గిల్​కు అప్పజెప్పింది. కొత్త కెప్టెన్‌ నేతృత్వంలో గుజరాత్‌ పెద్దగా రాణించలేకపోయింది.

మరోవైపు 2024లో పాయింట్స్‌ టేబుల్​లో ఎనిమిదో స్థానంలో నిలిచి నిరాశ పరిచింది. ఇప్పుడు ఫ్రాంచైజీ ఐపీఎల్ 2025పై ఫోకస్‌ పెట్టింది. మెరుగైన ఫామ్​ కనబరచాలని యోచిస్తోంది.

భారత్ x ఇంగ్లాండ్ సిరీస్- ఆ ఇద్దరు మళ్లీ ఫెయిల్- టెన్షన్​లో RCB ఫ్యాన్స్!

'చిల్ ఆర్సీబీ ఫ్యాన్స్!- ట్రోఫీ మీదే!' - ట్రోలర్స్​కు కుల్​దీప్​ స్ట్రాంగ్ కౌంటర్

ABOUT THE AUTHOR

...view details