తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

"శివరాత్రి రోజున పూజ - ఈ పూలు శివుడికి నచ్చవు - వీటితో పూజిస్తే వివాహం అవుతుంది" - FLOWERS SHOULD NOT OFFER TO SHIVA

- కొన్ని పూలతో పరమేశ్వరుడిని పూజించకూడదంటున్న జ్యోతిష్యులు

which flowers should offer to Shiva
Flowers Should not Offer to Shiva (Getty Images)

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2025, 2:14 PM IST

Flowers Should not Offer to Shiva :మహా శివరాత్రి రోజున శైవ క్షేత్రాలన్నీ శివ నామస్మరణతో మార్మోగిపోతాయి. హరహర మహాదేవ అంటూ భక్తులు ప్రణమిల్లుతారు. తెల్లవారుజాము నుంచే శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. చాలా మంది ఇంట్లోనే శివయ్యకు పూజలు చేస్తారు. అయితే, శివపూజలో ఏ పూలు వినియోగించాలి? ఏ పూలు అస్సలు ముట్టుకోకూడదు? అనే విషయం చాలా మంది భక్తులకు తెలియదు. అందుకే, ఈ స్టోరీ మీకోసం. ఏ పూలతో పూజిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో, ఏ పూలను శివయ్య మెచ్చడో ప్రముఖ జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్​ చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తుమ్మి పుష్పాలు :తొడిమ లేకుండా ఉండే తుమ్మి పూలతో పూజ చేస్తే శివయ్యకు చాలా ఇష్టం. వీటితో పరమేశ్వరుడిని పూజిస్తే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

పద్మాలు :మనం ఒక్కోసారి పొరపాటుగా ఇతరులను దూషిస్తాం. ఆ దోషాలు పోవాలంటే శివరాత్రి రోజున పద్మ పుష్పాలతో శంకరుడిని పూజించాలట. తప్పులు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుందట.

మందార పూలతో : శివరాత్రి రోజున మందారాలతో పరమేశ్వరుడిని పూజిస్తే శత్రు బాధలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

గన్నేరు పూలు :దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు శివరాత్రి రోజున గన్నేరు పూలతో ఈశ్వరుడిని పూజించాలని సూచిస్తున్నారు. దీంతో ఆరోగ్యం కుదురుకుంటుందని చెబుతున్నారు.

సన్నజాజులు :శివరాత్రి వేళ సన్నజాజులతో శివయ్యను పూజిస్తే, పెళ్లికాని వారికి వివాహ ఘడియలు దగ్గరవుతాయట. వయసు పెరిగినా వివాహం కాని వారికి ఉపయోగకరంగా ఉంటుందట.

గులాబీ పూలు : చాలా కాలంగా తీరని కోరిక ఏదైనా ఉంటే, శివరాత్రి రోజున గులాబీ పూలతో పూజించాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే మీ కోరిక కచ్చితంగా తీరుతుందట.

కదంబ పుష్పాలు : శివరాత్రి నాడు కదంబ పూలతో పరమేశ్వరుడిని పూజిస్తే తీవ్రమైన శత్రుబాధలు, దృష్టి దోషాలు తొలగిపోతాయని సూచిస్తున్నారు.

దీర్ఘాయు కోసం : దీర్ఘాయు కోసం అపమృత్యు దోషాలు తొలగిపోవడం కోసం, శివరాత్రి రోజున మల్లెపూలతో ముక్కంటిని పూజించాలని చెబుతున్నారు. వాసన లేని పూలతో పూజిస్తే దృష్టి దోషాలు తొలగుతాయట.

పూజించకూడని పూలు :పరమేశ్వరుడిని పూజించకూడని పుష్పాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ విషయం 'శివ మహాపురాణం విద్యేశ్వర సంహిత'లో స్పష్టంగా ఉందని మాచిరాజు చెబుతున్నారు. కేతకం అంటే మొగలి పువ్వు, చంపకం అంటే సంపంగి పువ్వు. ఈ రెండింటితో శివరాత్రి రోజున ఈశ్వరుడిని పూజించకూడదని సూచిస్తున్నారు. ఇవి కాకుండా మిగిలిన ఏ పూలతో పరమేశ్వరుడిని పూజించినా మంచిదేనని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి :

మహాశివరాత్రి నాడు శివయ్యకు ఎంతో ఇష్టమైన ప్రసాదాలు - నైవేద్యంగా పెడితే ఎంతో సంతోషిస్తాడు!

శివుడికి బిల్వపత్రం సమర్పణ - ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details