Astrological Remedies for Good Health :మనం జీవితంలో ఉన్నతమైన స్థానంలో స్థిరపడాలంటే డబ్బు కంటే కూడా ముఖ్యమైనది ఆరోగ్యం. హెల్దీగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలుగుతాం. అందుకే, పెద్దలు కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అని చెబుతుంటారు. అయితే, ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించాలనుకుంటే రోజూ కొన్ని ప్రత్యేకమైన నియమాలను పాటించాలంటున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు మాచిరాజు వేణుగోపాల్. వాటిని ఫాలో అవ్వడం ద్వారా మంచి ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యంసిద్ధిస్తుందంటున్నారు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రోజూ సూర్యోదయానికి ముందు, సాయం సంధ్యా వేళ ఈ నియమాలు పాటిస్తే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు పొందవచ్చంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు వేణుగోపాల్.
సూర్యోదయానికి ముందు చేయాల్సినవి!
సూర్యుడు ఉదయించడానికి ముందే నిద్రలేవాలి. ఆపై కాలకృత్యాలు పూర్తి చేసుకొని చల్లని నీరు లేదా గోరువెచ్చని నీటితో సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలి. అలాగే, విభూతిదారణ, డైలీ కనీసం కొద్దిసేపు అయినా దైవ ధ్యానాన్ని ఆచరించడం చేయాలంటున్నారు.
సాయం సంధ్యావేళ ఇలా చేయాలి!
- సూర్యోదయానికి ముందు పైన చెప్పిన నియమాలతో పాటు సాయం సంధ్యా వేళ ఇంట్లోని లైట్లు అన్నీ వేసి ఉంచాలి. అంటే సంధ్యాలక్ష్మీకి స్వాగతం పలికే విధివిధానాన్ని పాటించాలి. ఇలా రోజూ కొన్ని ప్రత్యేకమైన విధివిధానాలు పాటించినట్లయితే ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా వస్తుందంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు వేణుగోపాల్.
- ఎవరైతే నిత్యం ఇంట్లో "ఓం" ఛాంటింగ్ వినపడేటట్లు ఏర్పాట్లు చేసుకోవడం, దైవ సంకీర్తనతో శుభోదయాన్ని ప్రారంభించడం చేస్తారో వారికి అదృష్టం వరిస్తుందంటున్నారు.
- ఇంటి ప్రాంగణంలో తులసి మొక్క నాటి రోజూ అక్కడ దీపారాధనచేయడం, అదేవిధంగా ఇంటి ఆవరణలో వివిధ రకాల పూల మొక్కలను పెంచి ఆ మొక్కలకు నిత్యం నీటిని సమర్పిస్తూ శివనామం, హరినామం జపించడం వంటి పనులు ఎవరైతే చేస్తారో వారు కర్మ విధ్వంసనం జరిగి దాని వల్ల కలిగే అద్వితీయమైన ప్రభావంతో మంచి జీవనాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుందంటున్నారు. అంతేకాకుండా ఈ పనులన్నింటినీ ఎవరైతే నిర్వహిస్తారో అలాంటి వ్యక్తులు అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారని సూచిస్తున్నారు మాచిరాజు వేణుగోపాల్.