ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

'జగన్​కు బాధ్యత లేదు - గుడ్ బుక్​ కాదు గుండె బుక్ ఉండాలి' - వైఎస్సార్సీపీకి రాజీనామా

వైఎస్సార్సీపీకి మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ గుడ్​బై

Vasireddy Padma Resigned from YSRCP
Vasireddy Padma Resigned from YSRCP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 22 hours ago

Vasireddy Padma Quit YSRCP : రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్సార్సీపీకి ఊహించని షాక్​లు తగులుతున్నాయి. ఆ పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు నచ్చక కొందరు రాజీనామాల బాట పట్టగా, మరికొందరు వేరే పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే కీలక నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడారు. పలువురు మేయర్లు, కౌన్సిలర్లు గుడ్​ బై చెప్పేశారు. తాజాగా వైఎస్సార్సీపీకి మహిళ కమిషన్ మాజీ ఛైర్మన్​ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. పార్టీని వీడుతున్నట్లు రాజీనామా లేఖను వైఎస్​ జగన్‌కు పంపారు.

వైఎస్సార్సీపీని నడిపించడంతో పాటు పరిపాలనలోనూ వైఎస్​ జగన్​కి బాధ్యత లేదని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. అప్రజాస్వామిక పద్ధతులు, నియంతృత్వ ధోరణులు ఉన్న నాయకుడిని ప్రజలు మెచ్చుకోరని చెప్పారు. అందుకు ఈ ఎన్నికల తీర్పే నిదర్శనమని తెలిపారు. జీవితాలు, ప్రాణాలు పెట్టిన కార్యకర్తలు అవసరం లేదనుకునే వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఇప్పుడు గుడ్ బుక్ పేరుతో ఆయన మరోసారి మోసం చెేసేందుకు సిద్ధపడుతున్నారని వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు.

Vasireddy Padma Comments on Jagan :పార్టీలో కష్టపడిన వారి కోసం ఇప్పుడు జగన్ గుడ్ బుక్ ప్రమోషన్లు అంటున్నారని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సింది గుడ్ బుక్ కాదని, గుండె బుక్ అని తెలిపారు. వ్యక్తిగతంగా, విధానాలపరంగా అనేక సందర్భాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ఒక నిబద్ధత కలిగిన నాయకురాలిగా వైఎస్సార్సీపీలో పనిచేశానని వెల్లడించారు. ప్రజాతీర్పు తర్వాత అనేక విషయాలు సమీక్షించుకుని అంతర్మథనం చెంది పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు వాసిరెడ్డి పద్మ వివరించారు.

వైఎస్సార్సీపీకి షాక్​ - రాజ్యసభ సభ్యత్వానికి ఆర్‌.కృష్ణయ్య రాజీనామా - ఆమోదం - Krishnaiah resigned to Rajya Sabha

ABOUT THE AUTHOR

...view details