తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Apr 20, 2024, 10:42 PM IST

ETV Bharat / politics

ఆ ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థులు ఏ క్షణమైనా ఎంపీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటారు - షబ్బీర్​ అలీ హాట్ కామెంట్స్ - lok sabha elections 2024

Shabbir Ali sensational comments : త్వరలో బీఆర్ఎస్​కు చెందిన ముగ్గురు అభ్యర్థులు పార్లమెంట్​ ఎన్నికల బరిలో నుంచి తప్పుకోనున్నారని, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ సంచనలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ అభద్రతా భావంతో ఉన్నారని, అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 20మంది తనతో టచ్​లో ఉన్నారని అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్నారు.

Shabbir Ali on BRS Candidates
Shabbir Ali sensational comments

Shabbir Ali fires on KCR :పార్లమెంట్ ఎన్నికలు జరిగేలోపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోబోతున్నారని ప్రభుత్వ సలహాదారుడు, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ పేర్కొన్నారు. వారు అలా డ్రాప్​ కాకుండా ఉండటానికే, కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తనకు టచ్​లో ఉన్నారని మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో నిర్వహించిన పార్లమెంట్ సన్నాహక సమావేశంలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేశ్​ షెట్కార్​తో కలిసి పాల్గొన్నారు.

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌ కుటుంబ సభ్యులు జైలుకెళ్లడం ఖాయం : షబ్బీర్‌ అలీ - Shabbir Ali on KCR Family

Shabbir Ali on BRS Candidates : అంతకుముందు కాంగ్రెస్ నాయకుడు వేణుగోపాల్​రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్​కు, సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ ఫిరాయింపులపై ఇష్టం లేదన్నారు. కానీ కేసీఆర్ మాటిమాటికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతామని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నాయకులను చేర్చుకుంటున్నట్లు తెలిపారు.

20 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్​కి టచ్​లో ఉన్నారనడం అబద్దమని షబ్బీర్ అలీ తెలిపారు. ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఎలక్షన్ మధ్యలో డ్రాప్ ఆవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, కేసీఆర్ భయపడి అబద్దపు మాటాలు మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వాన్ని పడగొడుతామంటే చూస్తు ఊరుకోమని షబ్బీర్ అలీ హెచ్చరించారు. బీఆర్ఎస్​కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో టచ్​లో ఉన్నారన్నారు.

కేసీఆర్​కు జైలులోనే డబుల్ రూం కడుతామని, కుటుంబ సభ్యలందరిని ఒకే దగ్గర జైలులో ఉంచనున్నట్లు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఇప్పటికే లిక్కర్ కేసులో కవిత తీహాడ్ జైల్లో ఉందని, ఫోన్​ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ అరెస్టు కానున్నట్లు తెలిపారు. అందువల్ల జైలులో డబుల్​ బెడ్ రూం ఇల్లు కట్టనున్నట్లు ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో సురేశ్​ షెట్కార్​ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఎంపీ ఎన్నికల అనంతరం నియోజకవర్గ అభివృద్ధిపై పూర్తిస్థాయిలో దృష్టి పెడతానన్నారు.

"పార్లమెంట్ ఎన్నికలు జరిగేలోపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోబోతున్నారు. వారు అలా డ్రాప్​ కాకుండా ఉండటానికే, కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తనకు టచ్​లో ఉన్నారని మాట్లాడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు కాబోతుంది".- షబ్బీర్ అలీ, ప్రభుత్వ సలహాదారుడు

ఎంపీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకోనున్న ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థులు- షబ్బీర్​ అలీ హాట్ కామెంట్స్

కేటీఆర్‌ జైలుకు వెళ్లడం ఖాయం - షబ్బీర్‌ అలీ హాట్ కామెంట్స్ - Shabbir Ali hot comments

సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలు అమలయ్యే బాధ్యత మాది : షబ్బీర్ అలీ

ABOUT THE AUTHOR

...view details