తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Updated : 5 hours ago

ETV Bharat / politics

'బడుగుల గొంతులను నీ బుల్డోజర్లు ఆపలేవు' - తన కాన్వాయ్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ కేటీఆర్​ ట్వీట్​ - KTR and Harish on Congress Attack

KTR and Harish Rao on CM Revanth : బడుగుల గొంతులను నీ బుల్డోజర్లు ఆపలేవని, పిల్లి కూతలకు భయపడే వాడెవ్వడూ లేడిక్కడ అని మాజీమంత్రి కేటీఆర్​ సీఎం రేవంత్​ను ఉద్దేశిస్తూ అన్నారు. ఇవాళ తన కాన్వాయ్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ ఎక్స్​ వేదికగా కేటీఆర్​ ట్వీట్​ చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ప్రతిపక్షాల మీద దాడుల అంటూ మాజీమంత్రి హరీశ్​రావు సైతం ఎక్స్​ వేదికగా కాంగ్రెస్​పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

KTR and Harish Rao about Congress Attack in Musheerabad
KTR and Harish Rao on CM Revanth (ETV Bharat)

KTR and Harish Rao about Congress Attack in Musheerabad :''మీ తాటాకు చప్పుళ్లకు, పిల్లి కూతలకు భయపడే వాడెవ్వడూ లేడిక్కడ, ఇది ఉద్యమాల పిడికిలి, బలహీనుల గొంతుక గుర్తుపెట్టుకో'' అని మాజీ మంత్రి కేటీఆర్​ సీఎం రేవంత్ ​రెడ్డిని ఉదేశిస్తూ హెచ్చరించారు. ఇవాళ అంబర్‌పేట నియోజకవర్గంలోని తన కాన్వాయ్‌పై జరిగిన దాడిపై కేటీఆర్​ స్పందిస్తూ ఎక్స్​ వేదికగా ట్వీట్​ చేశారు. దాంతో పాటు ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ''బడుగుల గొంతులను నీ బుల్డోజర్లు ఆపలేవు. నీ గూండా రాజ్యాన్ని ఎదిరించే నా స్ఫూర్తిని, నీ గుండాలు ఆపలేరు'' అని కేటీఆర్​ ఎక్స్​లో వ్యాఖ్యానించారు. ఈ దాడి తనకు మరింత శక్తినిస్తుందని, తనను ఈ దాడులు ఆపలేవని స్పష్టం చేశారు.

దీనిపై మాజీ మంత్రి హరీశ్​రావు కూడా ఎక్స్​ వేదికగా స్పందిస్తూ కేటీఆర్​పై కాంగ్రెస్ చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీ చెప్పే నఫ్రత్‌కా బజార్‌ మే మొహబత్‌ కా దుకాణ్ ఇదేనా అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ప్రతిపక్షాల మీద దాడులు, నాయకుల అక్రమ అరెస్టులు, కేసులు ఇదేనా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని ప్రశ్నించారు. కేటీఆర్​పై దాడికి తెగబడిన వారిని గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.

అసలేం జరిగిందంటే : ఇవాళ హైదరాబాద్​లో మూసీ బాధితులను కలవడానికి వచ్చి తిరిగి వెళుతున్న మాజీ మంత్రి కేటీఆర్​ను ముషీరాబాద్ నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. అంబర్​పేట నియోజకవర్గంలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో కేటీఆర్​, స్థానిక శాసనసభ్యులు కాలేరు వెంకటేశ్​ పర్యటించారు. కూల్చివేతల గురించి స్థానికులను అడిగి తెలుకున్నారు. అక్కడ బాధితులను కలిసి మాట్లాడారు. ఆ తర్వాత ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠాగోపాల్ ఇంట్లో భోజనానికిగాను విద్యానగర్ మీదుగా వెళుతుండగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేటీఆర్ కాన్వాయ్​ను అడ్డుకున్నారు.

మంత్రి కొండా సురేఖకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ : మంత్రి కొండా సురేఖపై సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ట్రోల్సింగ్స్ పై క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. తెలంగాణ భవన్ ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలపై సోమవారం దాడి చేశారని, అందుకు భేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకుని నిరసనకారులను చెదరగొట్టారు.

'2020లోనే మూసీ ప్రక్షాళన చేద్దామనుకున్నాం - పేదలకు ఇబ్బందులు రాకూడదనే నిలిపివేశాం' - KTR Interaction with Musi Victims

కూల్చాల్సి వస్తే మొదట హైడ్రా కార్యాలయాన్నే కూల్చాలి : కేటీఆర్ - KTR Fires on Hydra

Last Updated : 5 hours ago

ABOUT THE AUTHOR

...view details