తెలంగాణ

telangana

ETV Bharat / photos

దిల్లీలో మండే ఎండ- భారీగా పెరిగిన కరెంట్ వాడకం- నీటికి కటకట - delhi highest temperature recorded - DELHI HIGHEST TEMPERATURE RECORDED

దేశ రాజధాని దిల్లీలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముంగేష్‌పుర్‌ ప్రాంతంలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎండలు భారీగా పెరగడం వల్ల విద్యుత్‌ డిమాండ్‌ బాగా పెరిగింది. దిల్లీ చరిత్రలోనే 8,302 మెగావాట్ల మార్కును దాటడం తొలిసారని అధికారులు తెలిపారు. ఎండల తీవ్రతతో దిల్లీలో పలుచోట్ల తాగునీటి కొరత ఏర్పడింది. నీటిని వృథా చేస్తే 2వేల రూపాయల జరిమానా విధించనున్నట్లు మంత్రి అతిశీ పేర్కొన్నారు. (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : May 29, 2024, 7:37 PM IST

దేశ రాజధాని దిల్లీలో ఎండలు ఠారేత్తిస్తున్నాయి. దిల్లీలోని పలుచోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముంగేష్‌పుర్‌ ప్రాంతంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. (Associated Press)
మంగళవారంతో పోలిస్తే ఒక్కరోజులోనే 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగాయని తెలిపారు. (Associated Press)
దిల్లీ చరిత్రలోనే ఈ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవడం ఎప్పుడూ లేదని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. (Associated Press)
రాజస్థాన్‌ నుంచి వచ్చే వేడి గాలులు వల్ల దిల్లీ నగర శివారు ప్రాంతాలు ముంగేష్‌పుర్‌, నరేలా, నజాఫ్‌గఢ్‌లో ఉష్ణోగ్రతలు పెరిగాయని IMD అధికారులు స్పష్టంచేశారు. (Associated Press)
నిర్మానుష్య ప్రదేశాల్లో రేడియేషన్‌, సూర్య కాంతి నేరుగా పడే ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం వల్ల దిల్లీలో విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరిగింది. (Associated Press)
బుధవారం మధ్యాహ్నం వరకు 8వేల 302 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉందని డిస్కం అధికారులు వెల్లడించారు. 8వేల 300మెగావాట్ల మార్కును దాటడం దిల్లీ చరిత్రలోనే మొదటిసారని పేర్కొన్నారు. (Associated Press)
దిల్లీలో ఎండల తీవ్రతతో పలుచోట్ల తాగునీటి కొరత ఏర్పడింది. నీటి కొరతను అధిగమించేందుకు దిల్లీ ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. (Associated Press)
ఎవరైనా నీటిని వృథా చేస్తే 2వేల రూపాయల జరిమానా విధించనున్నట్లు దిల్లీ మంత్రి అతిశీ తెలిపారు. నీటి పైపులతో కార్లను కడగడం, వాణిజ్యపరమైన అవసరాలకు వినియోగించడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని అధికారుల్ని ఆదేశించారు. (Associated Press)
రాజస్థాన్, పంజాబ్, హరియాణా, చండీగఢ్, దిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, గుజరాత్‌తో సహా అనేక ప్రాంతాలకు భారత వాతావరణశాఖ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. (Associated Press)
ఈ హీట్‌ వేవ్‌తో అన్ని వయసుల వారు అనారోగ్యం, వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువుగా ఉన్నట్లు హెచ్చరికలు చేసింది. (Associated Press)
దిల్లీ మాదిరిగానే వేడి గాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంది. (Associated Press)
ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లోని ఫలొదిలో 51 డిగ్రీలు, హరియాణాలోని సిర్సాలో 50.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. (Associated Press)
ఎండలకు ఇబ్బందులు పడుతున్న ప్రజలు (Associated Press)
ఎండలకు ఇబ్బందులు పడుతున్న ప్రజలు (Associated Press)
ఎండలకు ఇబ్బందులు పడుతున్న ప్రజలు (Associated Press)
ఎండలకు ఇబ్బందులు పడుతున్న ప్రజలు (Associated Press)
ఎండలకు ఇబ్బందులు పడుతున్న ప్రజలు (Associated Press)
ఎండలకు ఇబ్బందులు పడుతున్న ప్రజలు (Associated Press)
ఎండలకు ఇబ్బందులు పడుతున్న ప్రజలు (Associated Press)
ఎండలకు ఇబ్బందులు పడుతున్న ప్రజలు (Associated Press)

ABOUT THE AUTHOR

...view details