తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

బ్రేక్​ఫాస్ట్​లోకి అద్దిరిపోయే రెసిపీ - తమిళనాడు స్పెషల్ "గుంట పొంగనాలు" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా!

ఇంట్లో అందరికీ నచ్చే వెరైటీ "పొంగనాలు" - ఇలా చేసి ఇచ్చారంటే టేస్ట్​ సూపర్ గురూ!

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Gunta Ponganalu
Perugu Gunta Ponganalu (ETV Bharat)

How to Make Perugu Gunta Ponganalu : చాలా మంది ఇళ్లలో ఎప్పుడూ ఇడ్లీ, వడ, ఉప్మా, దోశ, పెసరట్లేనా.. అంటూ పిల్లలు పేచీ పెట్టడం, తినకుండా మారాం చేయడం చేస్తుంటారు. మీ పిల్లలూ ఇలానే చేస్తున్నారా? అయితే, మీకోసమే ఈ సూపర్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. "తమిళనాడు స్పెషల్ పెరుగు గుంట పొంగనాలు/పునుగులు". వీటికి కోసం ఎక్కువ శ్రమించాల్సిన పనిలేదు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలే కాదు ఎవరైనా వీటిని ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ కావాలంటున్నారు. అంత రుచికరంగా ఉంటాయి! మరి, ఇంకెందుకు ఆలస్యం ఈ సూపర్ టేస్టీ పొంగనాలతయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • వెల్లుల్లి రెబ్బలు - 7
  • ధనియాలు - 1 టేబుల్​స్పూన్
  • పచ్చికొబ్బరి ముక్కలు - ముప్పావు కప్పు
  • ఎండుమిర్చి - 7
  • మినపపప్పు - 2 టేబుల్ స్పూన్లు
  • కందిపప్పు - 2 టేబుల్ స్పూన్లు
  • శనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు
  • పెసరపప్పు - 2 టేబుల్ స్పూన్లు
  • బియ్యం - 1 కప్పు
  • పసుపు - అర టీస్పూన్
  • ఇంగువ - పావు టీస్పూన్
  • పుల్లని పెరుగు - 1 కప్పు
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఆయిల్ - తగినంత

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా రెసిపీలోకి కావాల్సిన మినపపప్పు, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పుతో పాటు బియ్యాన్నీ చిన్న చిన్న బౌల్స్​లో వేరువేరుగా ఒక గంటపాటు నానబెట్టుకోవాలి.
  • గంటయ్యాక పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం మిక్సీ జార్​ తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చికొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి వేసుకోవాలి.
  • తర్వాత అందులోనే నానబెట్టుకున్న పప్పులతో పాటు బియ్యాన్ని కూడా వేసుకోవాలి. అలాగే.. పసుపు, ఇంగువ, పెరుగు, కరివేపాకు, ఉప్పు వేసుకొని ఇడ్లీపిండిలా రవ్వ రవ్వగా ఉండేలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
  • ఆవిధంగా పిండిని ప్రిపేర్ చేసుకున్నాక.. గుంట పొంగనాలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై గుంట పొంగనాల పాత్ర పెట్టుకొని ప్రతి గుంటలో సగం వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి.
  • వాటిల్లో వేసుకున్న నూనె కాస్త వేడి అయ్యాక.. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని తీసుకుని ఒక్కో దాంట్లో సైడ్ నుంచి పిండి నింపుకుంటూ రావాలి. ఆఖరున మధ్యలో పిండిని నింపుకోవాలి.
  • ఈ విధంగా పిండిని తీసుకుంటేనే గుంట పునుగులు చక్కగా కాలుతాయి. అలాగే.. ఇక్కడ మనం పప్పులు ఎక్కువసేపు నానబెట్టుకోలేదు, పిండి ఎక్కువసేపు పులియలేదు కాబట్టి ఈ పొంగనాలు ఆయిల్ కూడా తక్కువగానే పీల్చుకుంటాయి.
  • అనంతరం తక్కువ మంట మీద రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే తమిళనాడు స్పెషల్ "పెరుగు గుంట పునుగులు" రెడీ!

ABOUT THE AUTHOR

...view details