ETV Bharat / offbeat

ముక్క చెదరకుండా ప్రెషర్​ కుక్కర్​లో "ఫిష్​ బిర్యానీ" - ఇలా చేస్తే సండే ప్లేట్లు ఖాళీ కావాల్సిందే! - HOW TO MAKE FISH BIRYANI IN COOKER

-చేపలతో పులుసు, ఫ్రై కామన్​ -ఇలా బిర్యానీ చేసుకుంటే ఫ్యామిలీ మొత్తం ఇష్టంగా తింటారు

How to Make Fish Biryani
How to Make Fish Biryani (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 15, 2025, 5:17 PM IST

Updated : Feb 15, 2025, 5:24 PM IST

How to Make Fish Biryani: చేపల వంటకాలు అంటేనే మెజార్టీ జనానికి నోరూరుతుంది. పులుసు, ఫ్రై, పచ్చడి ఏది చేసినా సరే ప్లేట్లు ఖాళీ కావాల్సిందే. అయితే ఎప్పుడూ చేపలతో పులుసు, ఫ్రై అంటే బోర్​కొడుతుంది. అలాంటి సమయంలో ఇలా బిర్యానీ చేసుకుంటే అద్దిరిపోతుంది. పైగా దీని కోసం ఎక్కువ పదార్థాలూ అవసరం లేదు. మరి ముక్క చెదరకుండా సూపర్​ టేస్టీ బిర్యానీని ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.

మ్యారినేషన్​ కోసం కావలసిన పదార్థాలు:

  • వంజరం చేప ముక్కలు - 1 కిలో
  • పసుపు - 1 టీస్పూన్
  • కారం - 1 టీస్పూన్
  • ఉప్పు - 1 టీస్పూన్

బిర్యానీ చేయడానికి కావలసిన పదార్థాలు:

  • నెయ్యి - 2 టేబుల్స్పూన్లు
  • నూనె - 1 టేబుల్స్పూన్
  • బిర్యానీ ఆకులు - 3
  • దాల్చిన చెక్క - కొద్దిగా
  • లవంగాలు - 4
  • యాలకులు - 3
  • ఉల్లిపాయలు - 5
  • తరిగిన అల్లం - కొద్దిగా
  • వెల్లుల్లి రెబ్బలు - 8
  • పచ్చిమిరపకాయలు - 3
  • ఎండుమిరపకాయలు - 3
  • తురిమిన పచ్చికొబ్బరి - 2 టేబుల్స్పూన్లు
  • నీళ్లు - సరిపడా
  • టమాటాలు - 3
  • పసుపు - 1 / 2 టీస్పూన్
  • కారం - 1 టీస్పూన్
  • ధనియాల పొడి - 2 టీస్పూన్లు
  • ఉప్పు - ఒకటిన్నర టీస్పూన్లు
  • కొత్తిమీర - గుప్పెడు
  • పుదీనా ఆకులు - గుప్పెడు
  • బాస్మతీ బియ్యం - 500 గ్రాములు
  • పలచటి కొబ్బరి పాలు - 500 మిల్లీలీటర్లు

తయారీ విధానం:

  • ఫిష్​ను శుభ్రంగా క్లీన్​ చేసి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్​ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని ఓ రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి.
  • ఓ బౌల్​లోకి చేప ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి ముక్కలకు బాగా పట్టేలా కలిపి మూత పెట్టి ఓ అరగంటసేపు పక్కన పెట్టాలి.
  • ఈలోపు ఓ గిన్నెలోకి బాస్మతీ బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు పోసి నానబెట్టాలి. అలాగే ఉల్లిపాయ, టమాటలను సన్నగా తరగాలి.
  • స్టవ్​ ఆన్ చేసి ప్రెషర్​ కుక్కర్​ పెట్టి నెయ్యి, నూనె పోసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేయాలి.
  • ఆ తర్వాత సన్నగా కట్​ చేసిన ఉల్లిపాయ తరుగు వేసి రంగు మారే వరకు వేయించాలి. ఈ లోపు మసాలా ప్రిపేర్​ చేసుకోవాలి.
  • మిక్సీజార్​ తీసుకుని అందులోకి తరిగిన అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్​లా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఉల్లిపాయలు బ్రౌన్​ కలర్​లోకి మారిన తర్వాత గ్రైండ్​ చేసుకున్న మసాలా పేస్ట్​ వేసి పచ్చివాసన పోయేవరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు టమాట ముక్కలు వేసి కలపాలి. ఆ తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. అనంతరం కొత్తిమీర తరుగు, పుదీనా ఆకులు వేసి బాగా వేగించాలి.
  • టమాట ముక్కలు మెత్తగా ఉడికి దగ్గరపడిన తర్వాత మ్యారినేట్​ చేసిన చేప ముక్కలను వేసి నిధానంగా కలపాలి.
  • ఓ రెండు నిమిషాల తర్వాత నానబెట్టిన బాస్మతీ బియ్యాన్ని నీళ్లు లేకుండా వేసుకుని ముక్కలు చెదరకుండా, బియ్యం విరగకుండా నెమ్మదిగా కలపాలి.
  • ఆ తర్వాత పల్చని కొబ్బరిపాలను పోసి కలిపి కుక్కర్​ మూత పెట్టి మీడియం ఫ్లేమ్​లో కుక్​ చేయాలి.
  • కుక్కర్​ నుంచి ఆవిరి వస్తున్నప్పుడు విజిల్​ పెట్టి 5 నిమిషాలు కుక్​ చేసి స్టవ్​ ఆఫ్​ చేయాలి.
  • ఓ పావు గంట తర్వాత కుక్కర్​ మూత తీసి సర్వ్​ చేసుకుంటే సూపర్​ టేస్టీ ఫిష్​ బిర్యానీ రెడీ. దీన్ని రైతాతో తింటే సూపర్​గా ఉంటుంది. మరి నచ్చితే మీరూ చేసుకుని ఈ సండే ఎంజాయ్​ చేయండి. అయితే ఇక్కడ మీకు వంజరం చేప ముక్కలు దొరకకపోతే వేరే ఏదైనా చేపతో ప్రిపేర్​ చేసుకోవచ్చు.

ఏ చేపలు తింటే గుండెకు మంచిది? - ఇవి తీసుకుంటే ఎక్కువ ఆరోగ్యమంటున్న నిపుణులు!

ఇదేందయ్యా ఇది - ప్లాస్టిక్​​ బాటిల్​తో ఇంత సులువుగా చేపలు పట్టొచ్చా?- ఐడియా అదుర్స్​ గురూ!

How to Make Fish Biryani: చేపల వంటకాలు అంటేనే మెజార్టీ జనానికి నోరూరుతుంది. పులుసు, ఫ్రై, పచ్చడి ఏది చేసినా సరే ప్లేట్లు ఖాళీ కావాల్సిందే. అయితే ఎప్పుడూ చేపలతో పులుసు, ఫ్రై అంటే బోర్​కొడుతుంది. అలాంటి సమయంలో ఇలా బిర్యానీ చేసుకుంటే అద్దిరిపోతుంది. పైగా దీని కోసం ఎక్కువ పదార్థాలూ అవసరం లేదు. మరి ముక్క చెదరకుండా సూపర్​ టేస్టీ బిర్యానీని ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.

మ్యారినేషన్​ కోసం కావలసిన పదార్థాలు:

  • వంజరం చేప ముక్కలు - 1 కిలో
  • పసుపు - 1 టీస్పూన్
  • కారం - 1 టీస్పూన్
  • ఉప్పు - 1 టీస్పూన్

బిర్యానీ చేయడానికి కావలసిన పదార్థాలు:

  • నెయ్యి - 2 టేబుల్స్పూన్లు
  • నూనె - 1 టేబుల్స్పూన్
  • బిర్యానీ ఆకులు - 3
  • దాల్చిన చెక్క - కొద్దిగా
  • లవంగాలు - 4
  • యాలకులు - 3
  • ఉల్లిపాయలు - 5
  • తరిగిన అల్లం - కొద్దిగా
  • వెల్లుల్లి రెబ్బలు - 8
  • పచ్చిమిరపకాయలు - 3
  • ఎండుమిరపకాయలు - 3
  • తురిమిన పచ్చికొబ్బరి - 2 టేబుల్స్పూన్లు
  • నీళ్లు - సరిపడా
  • టమాటాలు - 3
  • పసుపు - 1 / 2 టీస్పూన్
  • కారం - 1 టీస్పూన్
  • ధనియాల పొడి - 2 టీస్పూన్లు
  • ఉప్పు - ఒకటిన్నర టీస్పూన్లు
  • కొత్తిమీర - గుప్పెడు
  • పుదీనా ఆకులు - గుప్పెడు
  • బాస్మతీ బియ్యం - 500 గ్రాములు
  • పలచటి కొబ్బరి పాలు - 500 మిల్లీలీటర్లు

తయారీ విధానం:

  • ఫిష్​ను శుభ్రంగా క్లీన్​ చేసి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్​ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని ఓ రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి.
  • ఓ బౌల్​లోకి చేప ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి ముక్కలకు బాగా పట్టేలా కలిపి మూత పెట్టి ఓ అరగంటసేపు పక్కన పెట్టాలి.
  • ఈలోపు ఓ గిన్నెలోకి బాస్మతీ బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు పోసి నానబెట్టాలి. అలాగే ఉల్లిపాయ, టమాటలను సన్నగా తరగాలి.
  • స్టవ్​ ఆన్ చేసి ప్రెషర్​ కుక్కర్​ పెట్టి నెయ్యి, నూనె పోసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేయాలి.
  • ఆ తర్వాత సన్నగా కట్​ చేసిన ఉల్లిపాయ తరుగు వేసి రంగు మారే వరకు వేయించాలి. ఈ లోపు మసాలా ప్రిపేర్​ చేసుకోవాలి.
  • మిక్సీజార్​ తీసుకుని అందులోకి తరిగిన అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్​లా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఉల్లిపాయలు బ్రౌన్​ కలర్​లోకి మారిన తర్వాత గ్రైండ్​ చేసుకున్న మసాలా పేస్ట్​ వేసి పచ్చివాసన పోయేవరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు టమాట ముక్కలు వేసి కలపాలి. ఆ తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. అనంతరం కొత్తిమీర తరుగు, పుదీనా ఆకులు వేసి బాగా వేగించాలి.
  • టమాట ముక్కలు మెత్తగా ఉడికి దగ్గరపడిన తర్వాత మ్యారినేట్​ చేసిన చేప ముక్కలను వేసి నిధానంగా కలపాలి.
  • ఓ రెండు నిమిషాల తర్వాత నానబెట్టిన బాస్మతీ బియ్యాన్ని నీళ్లు లేకుండా వేసుకుని ముక్కలు చెదరకుండా, బియ్యం విరగకుండా నెమ్మదిగా కలపాలి.
  • ఆ తర్వాత పల్చని కొబ్బరిపాలను పోసి కలిపి కుక్కర్​ మూత పెట్టి మీడియం ఫ్లేమ్​లో కుక్​ చేయాలి.
  • కుక్కర్​ నుంచి ఆవిరి వస్తున్నప్పుడు విజిల్​ పెట్టి 5 నిమిషాలు కుక్​ చేసి స్టవ్​ ఆఫ్​ చేయాలి.
  • ఓ పావు గంట తర్వాత కుక్కర్​ మూత తీసి సర్వ్​ చేసుకుంటే సూపర్​ టేస్టీ ఫిష్​ బిర్యానీ రెడీ. దీన్ని రైతాతో తింటే సూపర్​గా ఉంటుంది. మరి నచ్చితే మీరూ చేసుకుని ఈ సండే ఎంజాయ్​ చేయండి. అయితే ఇక్కడ మీకు వంజరం చేప ముక్కలు దొరకకపోతే వేరే ఏదైనా చేపతో ప్రిపేర్​ చేసుకోవచ్చు.

ఏ చేపలు తింటే గుండెకు మంచిది? - ఇవి తీసుకుంటే ఎక్కువ ఆరోగ్యమంటున్న నిపుణులు!

ఇదేందయ్యా ఇది - ప్లాస్టిక్​​ బాటిల్​తో ఇంత సులువుగా చేపలు పట్టొచ్చా?- ఐడియా అదుర్స్​ గురూ!

Last Updated : Feb 15, 2025, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.