IRCTC Karnataka Tour:దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు విజిట్ చేయాలని చాలా మంది భావిస్తుంటారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి దూరప్రాంతాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. మరి మీరు కూడా పర్యాటక ప్రదేశాలు, ప్రముఖ దేవాలయాలు సహా ఇతర దర్శనీయ స్థలాల్లో పర్యటించేందుకు రెడీగా ఉన్నారా? అయితే మీకోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఓ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. అందరికీ అందుబాటులో ఉండేలా అతి తక్కువ ధరకే కర్ణాటకలోని పలు ప్రదేశాలను చూసేందుకు ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. మరి ఈ టూర్ ఎన్ని రోజులు? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు? ధర ఎంత? ప్రయాణం ఎప్పుడు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కర్ణాటకలోని ప్రముఖ దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల సందర్శనకు "డివైన్ కర్ణాటక" పేరుతో IRCTC టూరిజం ప్యాకేజీ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా ఈ టూర్ ఆపరేట్ చేస్తోంది. ఈ ప్యాకేజీ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగునుంది. కర్ణాటకలోని గోకర్ణ, మురుడేశ్వర్, ఉడిపి, శృంగేరి, ధర్మస్థల, కుక్కే సుబ్రమణ్య సహా పలు ప్రదేశాలు విజిట్ చేయవచ్చు. ప్రయాణ వివరాలు చూస్తే,
- మొదటి రోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్(6E 7549) జర్నీ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 8 గంటలకు మంగుళూరు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని హోటల్కు చేరుకుంటారు. బ్రేక్ఫాస్ట్ అనంతరం మంగళ దేవి, కద్రి మంజునాథ దేవాలయాలు దర్శించుకుంటారు. సాయంత్రం తన్నెరభావి బీచ్, కుద్రోలి శ్రీ గోకర్ణనాథ క్షేత్రం సందర్శిస్తారు. ఆ రాత్రికి డిన్నర్ చేసి మంగుళూరులోనే స్టే చేస్తారు.
- రెండో రోజు టిఫెన్ తర్వాత ఉడిపికి స్టార్ట్ అవుతారు. ఉడిపి చేరుకున్నాక హోటల్లో చెకిన్ అవుతారు. మధ్యాహ్నం సెయింట్ మేరీ ఐల్యాండ్, మల్పే బీచ్ విజిట్ చేస్తారు. సాయంత్రం శ్రీకృష్ణ ఆలయం దర్శించుకుని ఆ రాత్రికి అక్కడే స్టే చేస్తారు.
- మూడో రోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత హోరనాడు బయలుదేరుతారు. అక్కడ అన్నపూర్ణేశ్వరి ఆలయాన్ని దర్శించుకుని శృంగేరి బయలుదేరుతారు. శృంగేరి శారదాంబ ఆలయ సందర్శన అనంతరం తిరిగి ఉడిపి చేరుకుని ఆ రాత్రికి అక్కడ బస చేస్తారు.
- నాలుగో రోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత గోకర్ణ బయలుదేరుతారు. అక్కడ టెంపుల్, బీచ్ విడిట్ చేసి మురుడేశ్వర్కి స్టార్ట్ అవుతారు. అక్కడ టెంపుల్ దర్శించుకుని ఉడిపికి రిటర్న్ అవుతారు. ఆ రాత్రికి ఉడిపిలోనే స్టే చేయాలి.
- ఐదో రోజు అల్పాహారం తర్వాత మంజునాథ ఆలయాన్ని సందర్శించేందుకు ధర్మస్థలానికి బయలుదేరుతారు. అక్కడ స్వామివారిని దర్శించుకుని కుక్కే సుబ్రహ్మణ్యానికి వెళ్తారు. అక్కడ హోటల్లో చెకిన్ అయ్యి ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
- ఆరో రోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకుని మంగుళూరుకు రిటర్న్ అవుతారు. మధ్యాహ్నం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. సాయంత్రం 4.20 గంటలకు ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అవుతుంది. నైట్ 7 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ కంప్లీట్ అవుతుంది.
ధర వివరాలు చూస్తే:
- కంఫర్ట్లో సింగిల్ షేరింగ్కు రూ.43,550, డబుల్ ఆక్యూపెన్సీకి రూ.34,850, ట్రిపుల్ షేరింగ్కు రూ.33,500 పే చేయాలి.
- 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ.29,400, విత్ అవుట్ బెడ్ అయితే రూ.26,900 చెల్లించాలి.
- ఇక 2 నుంచి 4 సంవత్సరాల పిల్లలకు విత్ అవుట్ బెడ్ రూ.20,650 పే చేయాలి.