తెలంగాణ

telangana

అరుణాచల్ భారత్​ భూభాగమే- చైనా వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం : అమెరికా - US On China

By ETV Bharat Telugu Team

Published : Mar 21, 2024, 11:03 AM IST

Updated : Mar 21, 2024, 3:22 PM IST

US On China About Arunachal Pradesh : అరుణాచల్​ ప్రదేశ్​ తమదే అని అంటున్న చైనాకు అమెరికా కౌంటర్ ఇచ్చింది. చైనా చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపింది. అరుణాచల్​ప్రదేశ్​ ఎప్పటికీ భారత్​ భూభాగమే అని చెప్పింది. మరోవైపు, అమెరికా వ్యాఖ్యలను చైనా ఖండించింది.

US On China About Arunachal Pradesh
US On China About Arunachal Pradesh

US On China About Arunachal Pradesh :భారత భూభాగమైన అరుణాచల్‌ప్రదేశ్​ను తమదే అంటున్న చైనా వైఖరిని అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. ఆ భూభాగం ఎప్పటికీ భారత్‌దేనని తేల్చి చెప్పింది. ఆ విషయాన్ని ఏకపక్షంగా మార్చడానికి చైనా చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌ బుధవారం వెల్లడించారు.

అరుణాచల్‌ప్రదేశ్‌పై గతకొన్నేళ్లుగా చైనా మొండి వాదనలు వినిపిస్తోంది. ఆ ప్రాంతం తమ భూభాగంలోనిదేనని ఇటీవల ఆ దేశ రక్షణ శాఖ అధికార ప్రతినిధి సీనియర్‌ కర్నల్‌ ఝాంగ్‌ షియాంగాంగ్‌ అసంబద్ధ వాదనలకు దిగారు. దీన్ని భారత్‌ దీటుగా తిప్పికొట్టింది. చైనా చేసిన ప్రకటన అసంబద్ధమైనదని, అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో భాగమేనని మరోసారి స్పష్టం చేసింది. అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో అక్కడి పౌరులు ప్రయోజనం పొందుతూనే ఉంటారని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇటీవల అరుణాచల్​ ప్రదేశ్​ తమ భూభాగమేనని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అరుణాచల్‌ ప్రదేశ్‌కు 'జాంగ్‌నన్‌ (దక్షిణ టిబెట్‌)'గా చైనా పెట్టుకున్న పేరు . ఇటీవల భారత ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్‌లో సేలా సొరంగ మార్గాన్ని ప్రారంభించడంపై చైనా అభ్యంతరం చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌ తమ భూభాగమేనని, చట్టవ్యతిరేకంగా భారత్ ఏర్పాటు చేసిన రాష్ట్రాన్ని తాము ఎప్పటికీ గుర్తించబోమని డ్రాగన్‌ మరోసారి విషం కక్కింది.

చైనా సరిహద్దులో సేలా టన్నెల్
అరుణాచల్ ప్రదేశ్‌‌లో సరిహద్దు వెంబడి మిలిటరీ సన్నద్ధతను పెంచేలా కేంద్ర ప్రభుత్వం సేలా టన్నెల్ నిర్మించింది. అరుణాచల్​ ప్రదేశ్​లో ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించినప్పుడు ఈ సేలా టన్నెల్​ను ప్రారంభించారు. చైనా- భారత్‌ సరిహద్దులోని తవాంగ్‌కు సైనిక బలగాలను, సాయుధ సంపత్తిని తరలించేందుకు ఈ సొరంగ మార్గం ఉపయోగపడుతుంది. అన్ని కాలాల్లో అందుబాటులో ఉండే సేలా సొరంగ మార్గం దేశభద్రత రీత్యా అత్యంత కీలకంగా మారింది. ఈ టన్నెల్ గురించి పూర్తి వివరాలు కోసంఈ లింక్​పై క్లిక్ చేయండి.

పుతిన్​, జెలెన్‌స్కీకు మోదీ ఫోన్​ కాల్- ఎన్నికల తర్వాత రష్యా, ఉక్రెయిన్​కు ప్రధాని!

అధ్యక్ష రేసులో బైడెన్, ట్రంప్ జోరు- మరో 4రాష్ట్రాల ప్రైమరీ ఎన్నికల్లో విజయం

Last Updated : Mar 21, 2024, 3:22 PM IST

ABOUT THE AUTHOR

...view details