తెలంగాణ

telangana

ETV Bharat / international

సూడాన్​లోని ఓపెన్ మార్కెట్​పై పారామిలిటరీ గ్రూప్​​ దాడి- 54 మంది మృతి - SUDAN ATTACK

సుడాన్​లో పారామిలిటరీ గ్యాంగ్​ కాల్పులు- 54 మంది మృతి, 158 మందికి తీవ్రగాయాలు

Sudan
Sudan (Source : Associated Press (Representative Image))

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2025, 8:47 PM IST

Sudan Paramilitary Attack :సుడాన్​ ఓమ్‌దుర్మాన్ నగరంలోని ఓపెన్ మార్కెట్‌పై పారామిలిటరీ గ్రూపు శనివారం జరిపిన దాడిలో 54మంది మృతి చెందగా, మరో 158 మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా పిల్లలు, మహిళలు ఉన్నట్లు సుడాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దేశ సైన్యానికి వ్యతిరేకంగా పనిచేసే ఓ పారామిలిటరీ గ్రూపు ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. సుడాన్ అధికారిక ప్రతినిధి ఖలీద్ అల్ అలీసర్ ఆ దాడిని​ తీవ్రంగా ఖండించారు. మరణించిన వారిలో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆలాగే ఈ దాడిలో ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనట్లు ఆయన పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details