Sanjay Leela Bhansali Heera Mandi :విలక్షణ నటుల్లోని కొత్త కోణాన్ని ఆవిష్కించేవాళ్లలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ఆయన సినిమాల్లో భారీ సెట్స్తో పాటు తారాగణం కూడా ఓ రేంజ్లో ఉంటుంది. ఖామోషీ అనే సినిమాతో తన సినీ జర్నీని ప్రారంభించిన ఈ స్టార్ డైరెక్టర్ ఇప్పటి వరకు ఇండస్ట్రీకి ఎన్నో హిట్ సినిమాలను అందించారు. ఆయన డైరెక్టర్గానే కాకుండా రైటర్గా, నిర్మాతగా పలు ప్రతిష్టాత్మక చిత్రాలను తెరకెక్కించారు.
ఇటీవలే 'హీరామండి : ది డైమండ్ బజార్' అనే వెబ్సిరీస్ను తెరకెక్కించారు. ఆయన డైరెక్ట్ చేసిన తొలి సిరీస్ కూడా ఇదే కావడం విశేషం. భారీ తారాగణంతో పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్లో స్వాతంత్ర్యానికి ముందు పాకిస్థాన్లోని లాహోర్లో ఉన్న పరిస్థితులను చూపించారు. ఆ ప్రాంతంలో ఉన్న వేశ్యలు హీరామండి ఉండేవారట. ఆ సమయంలో జరిగిన పలు సంఘటనల సమాహారమే ఈ చిత్రం. ప్రస్తుతం ఈ సిరీస్కు నెట్టింట మంచి రెస్పాన్స్ వస్తోంది.
అయితే ఆయన తెరకెక్కించే పలు సినిమాల్లో వేశ్యల గురించి కొన్ని సీన్స్ను ఆయన సినిమాలో చూపిస్తుంటారు. గతంలో విడుదలై 'గంగూబాయ్ కఠియావాదీ', 'కలంక్', 'దేవదాస్' లాంటి సినిమాల్లో ఆయన ఈ విషయం గురించి ప్రస్తావించారు. అయితే ఆయన తీసిన ప్రతి సినిమాలో ఈ పాత్రల గురించి ఎందుకు చూపిస్తారు. దీని వెనకున్న అసలు కారణమేంటంటే ?