Dhanush sues Nayanthara :కోలీవుడ్ నటినయనతార, ఆమె భర్త, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్పై ధనుశ్ దావా వేశారు. పర్మిషన్ లేకుండా 'నానుమ్ రౌడీ దాన్' (నేనే రౌడీనే) విజువల్స్ వాడుకోవడం వల్ల ఆయన నిర్మాణసంస్థ తాజాగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు నయన్ దంపతులపై ధనుశ్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని పరిశీలించిన ధర్మాసనం, విచారణకు అంగీకరించింది.
ఏం జరిగిందంటే?
డాక్యుమెంటరీ విషయంలో నయన్, ధనుశ్ మధ్య తాజాగా వివాదం జరిగిన సంగతి తెలిసిందే. తమకు చాలా ముఖ్యమైన 'నానుమ్ రౌడీ దాన్' సినిమా విశేషాలను తమ పెళ్లి డాక్యుమెంటరీలో చూపించాలని నయన్ దంపతులు కోరినప్పటికీ, ఆ మూవీ నిర్మాత అయిన ధనుశ్ నుంచి ఎటువంటి పర్మిషన్ రాలేదని అందుకు తాను ఎంతో బాధపడ్డానంటూ నయనతార పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఓ బహిరంగ లేఖ కూడా రిలీజ్ చేశారు.
అందులో డాక్యుమెంటరీ ట్రైలర్లో వాళ్లు మూడు సెకన్ల సీన్స్ ఉపయోగించినందుకుగానూ పరిహారంగా ధనుశ్ రూ.10 కోట్లు డిమాండ్ చేశారంటూ నయన్ తెలిపారు. అంతేకాకుండా ఆ లేఖలో ఆమె ధనుశ్ క్యారెక్టర్ను కూడా తప్పుబట్టారు. ఆమెపై ధనుశ్ ద్వేషం కనబరుస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో సినీ ఇండస్ట్రీలో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చలకు దారితీశాయి. అయితే కొందరేమో ధనుశ్కు మద్దతు తెలుపగా, మరికొందరేమో నయన్కు సపోర్ట్ ఇచ్చారు.