తెలంగాణ

telangana

'ఆమె ఆర్తనాదాలు ఎవ్వరికీ వినిపించలేదు! సెమినార్​ హాల్​ బయట ఉన్నదెవరు?' : సీబీఐ - Kolkata Doctor Case CBI Update

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2024, 7:14 AM IST

Updated : Aug 24, 2024, 7:21 AM IST

Kolkata Doctor Case CBI : కోల్​కతా వైద్య విద్యార్థి అత్యాచారం కేసులో సీబీఐ కీలక విషయాలు వెల్లడించింది. ఆసుపత్రిలో భద్రత లోపాలపై ఆందోళన వ్యక్తం చేసింది. వైద్యులతో పాటుగా, ఆస్పత్రి సిబ్బందిని విచారించిన సీబీఐ పలు అంశాలు వెల్లడించింది.

Kolkata Doctor Case CBI Update
Kolkata Doctor Case CBI Update (ETV Bharat)

Kolkata Doctor Case CBI : బంగాల్ వైద్య విద్యార్థిని హత్యాచార కేసును విచారిస్తున్న సీబీఐ పలు కీలక అంశాలు వెల్లడించింది. సెమినార్‌ హాల్‌ డోర్‌ బోల్ట్‌ పని చేయడం లేదని, తమ విచారణలో బయటపడినట్లు పేర్కొంది. బాధితురాలిని చిత్రహింసలు పెడుతున్న సమయంలో సెమినార్‌ హాల్‌ లోపల నుంచి వచ్చిన శబ్దాలు ఎవ్వరికీ వినిపించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

"సెమినార్‌ హాల్‌ డోర్‌ బోల్ట్‌ విరిగిపోయింది. నేరం జరుగుతుండగా ఎవరూ లోనికి రాకుండా ఉండేందుకు హాల్‌ బయట నిల్చొని ఎవరైనా సహకరించారా" అనే కోణంలో విచారణ చేపట్టినట్లు సీబీఐ తెలిపింది. ఈ అంశాన్ని నిర్ధరించేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. బాధితురాలిని చిత్రహింసలు పెడుతున్న సమయంలో సెమినార్‌ హాల్‌ లోపల నుంచి వచ్చిన శబ్దాలు ఎవ్వరికీ వినిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని సీబీఐ వ్యాఖ్యానించింది.

గొళ్లెం పనిచేయకపోవడం గురించి ఇంటర్న్‌లు, జూనియర్‌ డాక్టర్‌ సిబ్బంది విచారణలో బయటపెట్టినట్లు సీబీఐ పేర్కొంది. దీంతో బోల్ట్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఆగస్టు 9న తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల సమయంలో సెమినార్‌ హాల్‌లోకి ప్రవేశించిందని డ్యూటీలో ఉన్న వైద్యుడు చెప్పినట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, ఈ కేసుకు సంబంధించి మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ను శుక్రవారం సీబీఐ ప్రశ్నించింది. మరోవైపు కేసులో ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్‌కు కోల్‌కతాలో ప్రత్యేక న్యాయస్థానం 14 రోజులు జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ కేసు విచారణ సిట్​ నుంచి సీబీఐకి బదిలీ!
ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌ ఆర్థిక అవకతవకలపై సిట్ దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కలకత్తా హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ హయాంలో ప్రభుత్వ ఆధీనంలోని ఆస్పత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరిపించాలంటూ ఆస్పత్రి మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ పిటిషన్‌ వేశారు. శుక్రవారం ఈ కేసు విచారణ చేపట్టిన బంగాల్ హైకోర్టు, విచారణను సీబీఐకి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మూడు వారాల్లోగా దర్యాప్తు ప్రొగ్రెస్​ రిపోర్ట్​ను సమర్పించాలని జస్టిస్ రాజర్షి భరద్వాజ్ సీబీఐని ఆదేశించారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది.
అయితే, వైద్య విద్యార్థి అత్యాచారం జరిగిన అనంతరం, ఆసుపత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు దిగిన బంగాల్ ప్రభుత్వం ఆగస్టు 20న సిట్‌ను ఏర్పాటు చేసింది.

'అశ్లీలతకు బానిస, పశువు లాంటి వాడు'- కోల్​కతా హత్యాచార నిందితుడి సైకోఅనలిటిక్ ప్రొఫైల్​లో కీలక విషయాలు! - Kolkata Doctor Case Accused

కోల్​కతా డాక్టర్ కేసులో కీలకంగా DNA రిపోర్ట్ - హత్యాచారానికి ముందు రోజు ఆస్పత్రిలోనే నిందితుడు! - Kolkata Doctor Murder Case

Last Updated : Aug 24, 2024, 7:21 AM IST

ABOUT THE AUTHOR

...view details