తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2024, 1:01 PM IST

Updated : Feb 8, 2024, 1:30 PM IST

ETV Bharat / bharat

'అబద్ధాలు ప్రచారం చేయడమే మోదీ గ్యారంటీ'- బీజేపీపై ఖర్గే ఫైర్

Kharge Comments On Modi : ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, రైతుల కష్టాలు గురించి ప్రధాని మోదీ మాట్లాడడం లేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఎన్​డీఏ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఆయన 'బ్లాక్​ పేపర్​'ను విడుదల చేశారు.

Congress Vs BJP Black Paper
Congress Vs BJP Black Paper

Kharge Comments On Modi :అబద్ధాలు ప్రచారం చేయడమే ప్రధాని మోదీ గ్యారంటీ అని ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఎన్​డీఏ 10 ఏళ్ల పాలనలో మోదీ కాంగ్రెస్‌ను నిందిస్తూనే ఉన్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికీ ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, రైతుల కష్టాలు వంటి అంశాల గురించి ఆయన(మోదీ) ఎందుకు మాట్లాడటం లేదని ఖర్గే ప్రశ్నించారు. ఈ విషయాల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ ఖర్గే ఆరోపించారు. అలాగే బుధవారం పార్లమెంట్‌ వేదికగా ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై ఆయన విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ప్రధాని మోదీ పాలనలోని వైఫల్యాలను ఎత్తిచూపుతూ 'బ్లాక్​ పేపర్​'ను విడుదల చేశారు ఖర్గే.

'ప్రజాస్వామానికి ప్రమాదం'
మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 'బ్లాక్​ పేపర్​'ను విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు ఖర్గే. 'దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదం పొంచి ఉంది. గత 10 ఏళ్లల్లో బీజేపీ 411 ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని కాంగ్రెస్​ ప్రభుత్వాలను ఇది కూల్చేసింది. ప్రజస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది' అని బీజేపీపై​ ఫైర్​ అయ్యారు.

తన పదేళ్ల పాలనపై గురువారం 'వైట్‌పేపర్‌'ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టన్నామని కేంద్రంలోని అధికార బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఫిబ్రవరి 1న తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ ఈ శ్వేతపత్రాన్ని సమర్పిస్తామని వెల్లడించారు. 2014 ముందు వరకు, ఆ తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి మధ్య తేడాను వెల్లడించే ఉద్దేశంతో దానిని పార్లమెంట్‌లోని ఉభయ సభల ముందు ఉంచుతామన్నారు. దాని ద్వారా గత పాలనలో లోపాలను ఎత్తిచూపడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

'మోదీ ఓబీసీలో పుట్టలేదు'
Rahul Comments On Modi Caste :ప్రధాని నరేంద్రమోదీ ఓబీసీగా జన్మించలేదని, గుజరాత్‌లోని తేలీ కులంలో పుట్టారని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. 'మోదీ కులాన్ని బీజేపీ ప్రభుత్వం 2000 సంవత్సరంలోనే ఓబీసీగా మార్చింది. ప్రధానమంత్రి ఉన్నత కులంలో జన్మించారు. కానీ నేను ఓబీసీగా పుట్టానని అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నారు. ఆ విషయం నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా? ఎందుకంటే ఆయన ఏ ఓబీసీని ఆలింగనం చేసుకోరు. ఏ రైతు లేదా కూలీ చేయి పట్టుకోరు. ఆయన కేవలం అదానీ చేయి మాత్రమే పట్టుకుంటారు' అని రాహుల్​ అన్నారు.

'మన్మోహన్‌జీ వీల్​చైర్​లో కూడా పనిచేశారు'- మాజీ ప్రధానిపై మోదీ ప్రశంసలు

నీటిలో తేలుతున్న రాముడి శిల- ఆలయానికి పోటెత్తిన భక్తులు, ఎక్కడో తెలుసా?

Last Updated : Feb 8, 2024, 1:30 PM IST

ABOUT THE AUTHOR

...view details