తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తేదీని మార్చకుండా రాజ్యాంగ పీఠికను సవరించవచ్చా?- సుప్రీంకోర్టు ప్రశ్న - సుప్రీం కోర్టు రాజ్యాంగ పీఠిక

Constitution Preamble Amendment : రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ అలాగే ఉంచి పీఠిక సవరణ చేయొచ్చా అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. రాజ్యాంగ పీఠికలోని 'సోషలిస్ట్​', 'సెక్యులర్' పదాలు తొలగించాలని రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్​పై వాదనల సందర్భందా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

Could Preamble Amendment Plea
Could Preamble Amendment Plea

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 7:03 PM IST

Constitution Preamble Amendment :రాజ్యాంగాన్ని అమోదించిన తేదీని మార్చకుండా రాజ్యాంగ ప్రవేశికను సవరించవచ్చా అని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రశ్నించింది. రాగ్యాంగ పీఠిక నుంచి 'సోషలిస్ట్​', 'సెక్యులర్' పదాలను తొలగించాలని రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రమణ్యస్మామి దాఖలు చేసిన పిటిషన్​పై అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు స్పందించింది. భారత రాజ్యాంగ పీఠిక నిర్దిష్ట తేదీతో వస్తుంది కాబట్టి చర్చ లేకుండా దానిని సవరించలేమని తెలిపింది. ఈ అంశంపై విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది.

ఇదీ కేసు
రాజ్యాంగ ప్రవేశిక నుంచి 'సోషలిస్ట్', 'సెక్యులర్' పదాలను తొలగించాలని రాజ్యసభ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై జస్టిస్​ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం విచారణ చేపట్టింది. శుక్రవారం సుబ్రమణ్యస్వామి, న్యాయవాది విష్ణుశంకర్​ జైన్ వాదనలు వినిపించారు. రాజ్యాంగాన్ని అమోదించిన తేదీ 1949 నవంబర్ 26ను మార్చకుండా రాజ్యాంగ పీఠికను సవరించవచ్చా? అని సుప్రీం కోర్టు ప్రాసిక్యూషన్​ను ప్రశ్నించింది.

అకడమిక్ పర్పస్ కోసం తేదీని మార్చకుండా రాజ్యాంగ పీఠికను మార్చవచ్చు అని జస్టిస్ దీపాంకర్ దత్త అన్నారు. అందులో సమస్య లేదని తెలిపారు. అయితే దీనికి సుబ్రమణ్య స్వామి బదులిస్తూ 'ఈ విషయంలో అదే అసలు ప్రశ్న' అని అన్నారు. అనంతరం జస్టిస్ దత్త స్పందించి 'బహుశా నేను చూసిన తేదీతో ఉన్న ఏకైక రాజ్యాంగ పీఠిక ఇదేనోమో. ఇందులో పలానా తేదీ రోజు ఈ రాజ్యాంగాన్ని మాకు మేము ఇచ్చుకుంటున్నాము అని ఉంది. నిజానికి ఒరిజినల్ రాజ్యాంగంలో రెండు పదాలు (సోషలిస్ట్, సెక్యులర్) లేవు' అని అన్నారు.

భారత రాజ్యాంగం పీఠిక నిర్దిష్ట తేదీతో వస్తుంది కాబట్టి చర్చ లేకుండా దానిని సవరించలేమని న్యాయవాది విష్ణు జైన్ వాదించారు. ఈ క్రమంలో సుబ్రమణ్య స్వామి జోక్యం చేసుకుని ఎమర్జెన్సీ (1975-77) సమయంలో 42వ సవరణ ఆమోదించారని గుర్తు చేశారు. ఈ అంశంపై వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది.
2022 సెప్టెంబర్​ 2న సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని, ఇదే అంశంపై బలరాం సింగ్ అవే వ్యక్తి సహా ఇతరులు వేసిన పిటిషన్లతో ట్యాగ్ చేసింది సుప్రీం కోర్టు. బలరాం సింగ్ తరఫున న్యాయవాది విష్ణు శంకర్ జైనా వాదనలు వినిపించారు.

రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సమయంలో 'సోషలిస్ట్', 'సెక్యులర్' అనే పదాలు పీఠికలో లేవు. 1976లో ఇందిరా గాంధీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ రెండు పదాలు చేర్చారు. దీంతో 'సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్రం' నుంచి 'సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రం'గా రాజ్యాంగ పీఠిక మారింది.

Secular Word Removed : రాజ్యాంగం నుంచి ఆ పదాలు మిస్సింగ్.. బీజేపీపై కాంగ్రెస్ ఫైర్.. అసలైన పీఠిక ఇదేనన్న కేంద్రం!

Karnataka Preamble Reading : ఒకేసారి 'రాజ్యాంగ పీఠిక' చదివిన లక్షలాది మంది.. స్కూళ్లలో కూడా ఇక తప్పనిసరి!

ABOUT THE AUTHOR

...view details