తెలంగాణ

telangana

వైద్యురాలి హత్య జరిగితే - ఆత్మహత్య అంటూ ఆసుపత్రి నుంచి ఫోన్‌ చేశారు - ఎందుకు? - KOLKATA DOCTOR RAPE CASE UPDATES

By ETV Bharat Telugu Team

Published : Aug 13, 2024, 1:03 PM IST

Kolkata Doctor Rape Case Twist : కోల్‌కతాలోని ఆర్‌జీ కార్‌ వైద్య కళాశాల ఆసుపత్రి జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటన బంగాల్​ను కుదిపేస్తోంది. ఇప్పుడు ఈ కేసులో మరో కీలక విషయం బయటకు వచ్చింది. ఆమె ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు ఆసుపత్రి నుంచి మృతురాలి కుటుంబ సభ్యులకు ఫోన్ కాల్ వెళ్లినట్లు సమాచారం.

Kolkata doctor rape-murder case
Kolkata doctor rape-murder case (ANI)

Kolkata Doctor Rape Case Twist :కోల్‌కతాలోని ఆర్‌జీ కార్‌ వైద్య కళాశాల ఆసుపత్రి జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటన బంగాల్‌ను కుదిపేస్తోంది. దీనికి సంబంధించి పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు ఆసుపత్రి నుంచి మృతురాలి కుటుంబ సభ్యులకు ఫోన్ కాల్ వచ్చినట్లు సమాచారం. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆ కాల్ చేసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించినట్లు ఓ మీడియా సంస్థ తెలిపింది.

విచారణ కొనసాగుతూనే ఉంది!
పోలీసులు జూనియర్​ డాక్టర్​పై హత్యాచారంపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. హత్యను ఆత్మహత్యగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో, కనుక్కొనేందుకు ఆ అధికారిని కూడా ప్రశ్నిస్తున్నారు. మరోపక్క ఏడుగురు జూనియర్ డాక్టర్లను కూడా పోలీసులు ప్రశ్నించారు. అందులో నలుగురు ఆమెతో డిన్నర్ కూడా చేశారు.

అర్ధరాత్రి నిరసనలు చేపట్టనున్న మహిళలు
తమ డిమాండ్లు నెరవేరే వరకు, న్యాయం జరిగే వరకు సమ్మెను విరమించబోమని ఇప్పటికే ది ఫెడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. నో సేఫ్టీ-నో డ్యూటీ అంటూ నిరసనకారులు ప్లకార్డులను ప్రదర్శించారు. వీరితోపాటుగా కోల్‌కతా, బెంగాల్‌లోని ఇతర ప్రాంతాలకు చెందిన మహిళలు వినూత్న ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. వారంతా బుధవారం అర్ధరాత్రి నిరసన చేపట్టాలని నిర్ణయించారు. ‘స్వాతంత్ర్యం వచ్చిన అర్ధరాత్రి - మహిళల స్వాతంత్ర్యం కోసం’ పేరిట రేపు రాత్రి 11.55 గంటలకు దీనిని ప్రారంభించనున్నారు.

ఎక్కడెక్కడ నిరసనలు చేపట్టాలో ఆయా ప్రాంతాలను సోషల్‌ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీనికి సంఘీభావంగా పలువురు పురుషులు కూడా ఇందులో భాగం కావాలని నిర్ణయించుకున్నారు. స్వస్తికా ముఖర్జీ, చర్నీ గంగూలీ, ప్రతిమ్‌ డి గుప్తా వంటి సినీ ప్రముఖులు మద్దతుగా రానున్నారు.

వారంలోగా కేసు పరిష్కారం!
సోమవారం బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు. వారంలోగా కేసును పరిష్కరించాలని పోలీసులకు అల్టిమేటం జారీచేశారు. ‘‘ఈ కేసులో మరింత మంది నిందితులు ఉన్నట్లైతే వారందరినీ ఆదివారంలోగా అరెస్టు చేస్తాం. ఒకవేళ అప్పటిలోగా రాష్ట్ర పోలీసులు కేసును పరిష్కరించలేకపోతే దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తాం’’ అని ఆమె తెలిపారు. కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని భాజపా ఎంపీ కంగనా రనౌత్‌ డిమాండ్ చేశారు.

ప్రాథమిక పోస్ట్‌మార్టమ్‌ నివేదిక ప్రకారం, బాధితురాలి కళ్లు, నోరు, అంతర్గత అవయవాల నుంచి రక్తస్రావం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇతర భాగాల్లో కూడా గాయాలున్నట్లు తేలింది. అయితే వైద్యురాలిని మొదట హత్య చేసి, ఆ తర్వాత నిందితుడు అత్యాచారానికి పాల్పడి ఉంటాడని మరో పోలీసు అధికారి వెల్లడించారు. నిందితుడు సంజయ్‌ రాయ్‌ దర్యాప్తు సమయంలో ఎటువంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోగా, తనను ఉరి తీయాలనుకుంటే తీసుకోవాలంటూ ఎదురుచెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. అతడి ఫోన్‌ నిండా అశ్లీల వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది. అతడికి ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు జరిగినట్లు సమాచారం.

'అవమానం భరించలేక' - 'కోల్​కతా' మెడికల్ కాలేజ్​ ప్రిన్సిపల్‌ రాజీనామా - Kolkata Doctor Rape Murder Case

2036 నాటికి భారత జనాభా 152 కోట్లు - పెరగనున్న మహిళలు - తగ్గనున్న యువత - INDIA POPULATION 2036

ABOUT THE AUTHOR

...view details