TWINS RAMP WALK SHOW హైదరాబాద్ నగరంలో కవలలు చేసిన ర్యాంప్ వాక్ అదిరిపోయింది. జేసీఐ సికింద్రాబాద్ అనే సంస్థ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా జుద్వా పేరుతో కార్యక్రమం నిర్వహించింది. సుమారు 150 మంది కవలలతో సికింద్రాబాద్లోని కంటోన్మెంట్లో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 3 నెలల నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులైన కవలలు చేసిన ర్యాంప్ వాక్ చూపరులను ఆకట్టుకుంది.