ఖమ్మం నగరం ఎలా మారిందో చూస్తారా?
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14935003-355-14935003-1649155062725.jpg)
ఖమ్మం నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. పురపాలక మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గతంలో ఖమ్మంలో పర్యటించిన మంత్రి కేటీఆర్... నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఆ మేరకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యవేక్షణలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఫుట్పాత్లు, బస్ సెల్టర్స్, గోడలపై ప్రముఖుల చిత్రపటాలు గీయించారు. సిటీని క్లీన్ అండ్ గ్రీన్గా తీర్చిదిద్దారు. దీనిపై ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ట్వీట్ చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST