పెట్రోల్ బంక్​లో నిద్రిస్తున్న వ్యక్తిపై నుంచి వెళ్లిన టిప్పర్​- కూలీ మృతి

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2023, 11:23 AM IST

thumbnail

Tipper Ran Over Sleeping Person In Udupi : పెట్రోల్ బంక్ ఆవరణలో నిద్రిస్తున్న వ్యక్తిపై నుంచి టిప్పర్​ వెళ్లగా.. అతడు ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటక ఉడుపిలో జరిగిందీ ఈ ప్రమాదం. 

ఇదీ ప్రమాదం..
ఉడుపి పట్టణంలోని సోమేశ్వర్ పెట్రోల్ బంక్​ ఆవరణలో శుక్రవారం తెల్లవారుజామున శివరాజ్​, మరో వ్యక్తి పడుకున్నారు. ఆ సమయంలో పెట్రోల్ బంక్​కు ఓ టిప్పర్ వచ్చింది. ఇద్దరు కూలీలు బంక్​ ఆవరణలో నిద్రిస్తున్నారని టిప్పర్​ డ్రైవర్ గమనించలేదు. ట్యాంక్​లో డీజిల్ నింపుకుని బయటకు వెళ్లేటప్పుడు శివరాజ్​పై నుంచి టిప్పర్​ను నడిపాడు. ఈ క్రమంలో శివరాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. పక్కనే ఉన్న వ్యక్తి వెంటనే అప్రమత్తమై.. పెట్రోల్ బంక్ సిబ్బందికి విషయం చెప్పాడు. అందరూ కలిసి శివరాజ్​ను ఆస్పత్రికి తరలించారు. అయితే.. అతడు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. 
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. టిప్పర్ డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు. మృతుడు శివరాజ్​ను​.. షిమోగాలోని కొర్లికొప్పా గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ప్రమాద దృశ్యాలు పెట్రోల్ బంక్​లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.