కరెంట్ షాక్​కు మూడు ఏనుగులు బలి.. అంత్యక్రియలు చేసిన గ్రామస్థులు

By

Published : Aug 4, 2023, 12:06 PM IST

thumbnail

Three Elephants Died Electrocution In Assam : అసోంలోని గువాహటిలో విషాదం నెలకొంది. టీ తోటలోకి వెళ్లిన మూడు ఏనుగులు కరెంట్ షాక్​తో మరణించాయి. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఏనుగుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వాటికి అంత్యక్రియలు నిర్వహించారు.  

అసలేం జరిగిందంటే.. గువాహటి.. అటవీ ప్రాంతంలో ఓ కాఫీ తోటలోకి గురువారం రాత్రి మూడు ఏనుగులు ప్రవేశించాయి. ఆ తోటలో విధ్వంసం సృష్టించాయి. ఈ క్రమంలో కరెంట్ తీగ తెగి కొబ్బరి చెట్టుపై పడింది. దీంతో అక్కడే ఉన్న మూడు ఏనుగులు మరణించాయి. ఏనుగుల మృతి సమాచారం అందుకున్న అటవీ అధికారులు.. గ్రామస్థుల సాయంతో వాటికి పూడ్చిపెట్టారు.  

గర్భంతో ఉన్న ఏనుగు హత్య..
ఈ ఏడాది మేలో 10 నెలల గర్భంతో ఉన్న ఏనుగును తుపాకీతో కాల్చి చంపిన ఘటన కర్ణాటక కొడగు జిల్లాలో జరిగింది. ఆహార అన్వేషణలో భాగంగా అడవి నుంచి వచ్చిన 20 ఏళ్ల ఏనుగును రసూల్‌పుర్​, బాలుగోడు ప్రాంతంలో ఆగంతకులు కాల్చి చంపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగు మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిర్వహించిన పశువైద్యులు మృతి చెందిన ఏనుగు కడుపులో మగ పిండం ఉన్నట్లు తెలిపారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.