మ్యాజిక్​ దీపాలు వచ్చేశాయి.. నీరు పోస్తే వెలుగుతాయ్​.. తీసిస్తే ఆరిపోతాయ్

By

Published : Oct 20, 2022, 10:32 AM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

thumbnail

water lit lamps: అమావాస్యనాడు వచ్చే పండుగ దీపావళి.. ఇల్లంతా అలంకరించిన దీపాల కాంతులు మరింత సందడిని నింపుతుంది. కాలక్రమేణా ప్రమిదల్లో దీపాలు వెలిగించడంతో పాటు కొవ్వొత్తులు వెలిగించి దీపావళి చేసుకోవడం అలవాటైపోయింది. ఇప్పడుప్పుడు విద్యుత్​ దీపాలు, రంగు రంగుల ఎల్​ఈడీ దీపాలు తోరణాలు పండుగతో పాటు ఇళ్లలో చేరి పోయాయి. అంతే కాకుండా మట్టి ప్రమిదలను నీటిలో నానబెట్టి నీడలో ఆరబెడితే తక్కువ నూనె ఖర్చు అవుతోందని అమ్మ ఉపాయం చెబుతుంది మీకు గుర్తుందా!! ఇవ్వన్ని ఇప్పడు ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నరా.. ఈ దీపావళికి మరింత వెలుగులు నింపడానికి.. నూనె ఆదాచేయడానికి ఈసారి ప్లాస్టిక్​ ప్రమిదలతో ఉండే దీపాలు వచ్చేశాయి. వీటి ప్రత్యేకత ఎమిటంటే వీటిలో నీరు పోస్తే దీపం వెలుగుతోంది.. నీరు తీసివేస్తే దీపం ఆరిపోతోంది. దీనికి ఒకసారి ఛార్జింగ్​ ఎక్కిస్తే 48గంటలు పాటు నిరంతరాయంగా వెలుగుతోంది. దీని ధర కూడా రూ.80 కావడంతో వినియోగదారులు కొనడానికి బాగా ఆసక్తీ చూపిస్తున్నారు.

Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.