Rainfall Alert in Telangana : రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు వానలు.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ - Heavy Rain in Warangal
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-09-2023/640-480-19572845-thumbnail-16x9-rainfall-alert-telangana.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Sep 21, 2023, 8:15 PM IST
Rain Alerts in Telangana : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఇవాళ ఎల్లో అలెర్ట్ సైతం జారీ చేసింది. ఈరోజు అల్పపీడనం దక్షిణ ఝార్ఖండ్ పరిసరాలలో కొనసాగుతూ ఉందని.. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి.. ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపు వాలి ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులు పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
Heavy Rain in Warangal : ఈ క్రమంలో ఇవాళ వరంగల్ నగరంలో భారీ వర్షం నమోదయింది. హనుమకొండ కాజీపేటతో పాటు వరంగల్ నగరంలో ఒక్కసారిగా కురిసిన వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులపై మురుగునీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి వద్ద వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు విఘాతం ఏర్పడింది. గత కొద్ది రోజులుగా తీవ్ర ఉక్కపోతుతో ఇబ్బందులు పడుతున్న నగరవాసులకు ఒక్కసారిగా కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం దక్కింది.