thumbnail

ఓటమి భయంతోనే నాపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ పువ్వాడ

By ETV Bharat Telangana Team

Published : Nov 6, 2023, 3:41 PM IST

Puvvada Strong Counter to thummala : ఇటీవల తుమ్మల చేసిన విమర్శలకు ధీటుగా పువ్వాడ అజయ్‌ కుమార్​ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కాక పుట్టిస్తున్నాయి. ఖమ్మంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభతో.. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటికి శ్రీనివాస్​కు ఓటమి భయం పట్టుకుందని మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. ఖమ్మం ప్రజలను మోసం చేసేందుకు తుమ్మల, పొంగులేటిని 'మోసం చేసే జిత్తులమారి నక్కలుగా' మారారని పువ్వాడ విమర్శించారు. ఇద్దరు నేతల తీరును ప్రజలు గమనిస్తున్నారని.. రాబోయే ఎన్నికల్లో వారికి ప్రజలు బుద్ధి చెప్పటం ఖాయమన్నారు.

ఖమ్మంలో తాను చేసిన అభివృద్ధిని వారు చేసినట్టుగా ప్రకటించుకుంటున్నారని పువ్వాడ మండిపడ్డారు. ఓటమి భయంతోనే ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నీతి నిజాయతీతో రాజకీయాలు చేసే తనపై బురదజల్లేలా కాంగ్రెస్‌ నేతల ఛార్జిషీట్‌ ఉందని మండిపడ్డారు. తనపై వేసిన ఛార్జిషీట్​లో ఏ ఒక్కటైనా నిరూపిస్తే ముక్కును నేలకు రాస్తానన్నారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే తన ఆస్తినంతా రాసిస్తానని పువ్వాడ సవాల్​ విసిరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.